అవన్నీ వట్టి వదంతులే అంటున్న స్వీటీ....

తెలుగులో ప్రస్తుతం టాలీవుడ్ హీరోయిన్ స్వీటీ అనుష్క “నిశ్శబ్దం” అనే చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు హేమంత్ మధుకర్ దర్శకత్వం వహిస్తుండగా టాలీవుడ్ ప్రముఖ సినీ నిర్మాత కోన వెంకట్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

 Nishabdham, People Media Factory, Anushka, Anjali, Shalini Pandey, Tollywood, He-TeluguStop.com

అయితే ఇప్పటికే ఈ చిత్రానికి సంబందించి చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ పాటికే విడుదల కావాల్సి ఉంది.కానీ ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా థియేటర్లు తాత్కాలికంగా మూసివేయడంతో కొంత కాలం పాటు ఈ చిత్రాన్ని విడుదలన ఈ చిత్ర యూనిట్ సభ్యులు తాత్కాలికంగా వాయిదా వేశారు.

దీంతో ఈ చిత్రానికి సంబంధించిన పలు వార్తలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.ఇందులో ముఖ్యంగా ఈ చిత్రాన్ని చిత్ర యూనిట్ సభ్యులు ప్రముఖ ఓటిటి ప్లాట్ఫారం అయిన అమెజాన్ ప్రైమ్ వీడియోస్ కి అమ్మేయాలని నిర్ణయించుకున్నారని, కానీ దీనికి అనుష్క ఒప్పుకోవడం లేదని పలు వార్తలు సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతున్నాయి.

రోజురోజుకి ఈ వార్తలు ఎక్కువ అవుతుండడంతో తాజాగా నిశ్శబ్దం చిత్ర యూనిట్ సభ్యులు ఈ విషయంపై తమ అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందించారు.

ఇందులో భాగంగా ఈ చిత్రం మొదలు పెట్టినప్పటి నుంచి ప్రతి ఒక్కరు కష్టపడి పనిచేశారని ముఖ్యంగా అనుష్క ఈ చిత్రం కోసం ఎంతో కష్టపడ్డారని తెలిపారు.

ప్రస్తుతం నిశ్శబ్దం చిత్రం గురించి వస్తున్నటువంటి పుకార్లను నమ్మవద్దని చిత్ర యూనిట్ సభ్యులు అభిమానులకి తెలియజేశారు.అంతేగాక తొందర్లోనే ఈ చిత్ర విడుదలకు సంబంధించిన వివరాలను తెలియజేస్తామని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube