టాలీవుడ్ స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి ప్రస్తుతం ఏడాదికో సినిమా చొప్పున చేస్తూ వస్తోంది.గతేడాది భాగమతి చిత్రంతో మెప్పించిన అనుష్క సైరా నరసింహా రెడ్డి సినిమాలో గెస్ట్ రోల్ చేసింది.
కాగా తాజాగా నిశ్శబ్దం అనే సినిమాతో మనముందుకు వచ్చేందుకు రెడీ అయ్యింది.అప్పుడెప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా వరుస వాయిదాలతో రిలీజ్కు నోచుకోకుండా వస్తోంది.
కాగా నిశ్శబ్దం సినిమాను జనవరి 31న ఎట్టిపరిస్థితుల్లో రిలీజ్ చేయాలని భావించిన చిత్ర యూనిట్, మరోసారి ఈ సినిమా రిలీజ్ను వాయిదా వేశారు.కాగా ఈసారి ఎందుకు వాయిదా వేశారనే విషయంపై చిత్ర యూనిట్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.
ఈ సినిమాలో అనుష్క ఓ మూగ, చెవిటి అమ్మాయిగా నటిస్తోంది.సస్పెన్స్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ సినిమాను ఫిబ్రవరి 20న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమవుతోంది.
మాధవన్, అంజలి కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను హేమంత్ మధుకర్ డైరెక్ట్ చేస్తుండగా, కోన వెంకట్ ప్రొడ్యూస్ చేస్తున్నాడు.మరి ఈ సినిమాతో స్వీటీ మరోసారి తన సత్తా చాటుతుందా లేదా అనేది చూడాలి.
ఏదేమైనా వరుస వాయిదాలతో ఈ సినిమా ఎలాంటి బజ్ లేకుండా నిశ్శబ్దంగా మారుతుందని ప్రేక్షకులు అంటున్నారు.