విలక్షణ నటి అనుష్క శెట్టి ప్రస్తుతం నటిస్తున్న అటువంటి చిత్రం నిశ్శబ్దం.ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు హేమంత్ మధుకర్ దర్శకత్వం వహిస్తున్నాడు.
అలాగే ఈ చిత్రంలో విలక్షణ నటుడు మాధవన్, తెలుగు భామ అంజలి, హీరోయిన్ షాలిని పాండే తదితరులు ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు.ఈ చిత్రాన్ని ప్రముఖ సినీ నిర్మాత కోన వెంకట్ నిర్మిస్తున్నారు.
అయితే ఈ చిత్రం తమిళం, తెలుగు రెండు భాషల్లోనూ తెరకెక్కుతోంది.
అయితే తాజాగా నిశ్శబ్దం చిత్ర యూనిట్ సభ్యులు ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 2వ తారీఖున విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటన చేశారు.
అంతేగాక ఈ విషయానికి సంబంధించినటువంటి పోస్టర్ ను కూడా విడుదల చేశారు.దీంతో అనుష్క అభిమానులు పండగ చేసుకుంటున్నారు.అయితే ఈ చిత్రంలో అనుష్క మూగ, చెవిటి వ్యాధితో బాధ పడుతున్న టువంటి ఓ యువతి పాత్రలో నటిస్తోంది.
అయితే ఎప్పుడూ విభిన్న పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరించే అటువంటి అనుష్క ఈ సారి మరో కొత్త తరహా పాత్రలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. గతంలో అనుష్క నటించిన టువంటి భాగమతి చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసింది.దీంతో ఈ అమ్మడు ఈ విక్టరీని కొనసాగించేందుకు సిద్ధపడుతోంది.