ప్రధానిగా నరేంద్ర మోడీ రెండో సారి పదవిని చేపట్టి ఇప్పటికే 54 మందితో తన క్యాబినెట్ ని కూడా ప్రకటించేసాడు.అతి పెద్ద క్యాబినెట్ ని ఏర్పాటు చేసిన నరేంద్ర మోడీ అందులో కీలక పదవిని మన తెలుగింటి కోడలు నిర్మలా సీతారామన్ కి ఇచ్చి మహిళలలకి తన క్యాబినేత్ లో ఎవ్వరు ఇవ్వనంత పెద్ద హోదా ఇచ్చాడు.
రాజ్యసభ సభ్యురాలిగా కొనసాగుతున్న నిర్మలా సీతారామన్ ఇప్పటికే దేశ రక్షణ మంత్రిగా గత ప్రభుత్వ హయాంలో బాద్యతలు నిర్వహించి తమ సమర్ధతని నిరూపించుకుంది.రక్షణ మంత్రిగా ఇందిరాగాంధీ తర్వాత పని చేసిన రెండో మహిళగా నిర్మలా సీతారామన్ గుర్తింపు పొందింది.
ఇదిలా ఉంటే కొత్త ప్రభుత్వంలో కూడా ప్రధాని మోడీ మరోసారి ఆమెకి కీలక పదవి ఇచ్చాడు.దేశంలో అత్యున్నత క్యాబినెట్ పదవులలో ఒకటిగా ఉండే ఆర్ధిక మంత్రి పదవిని బాద్యతలు ఆమెకి అప్పగించాడు.
గతంలో అరుణ్ జైట్లీ ఆర్ధిక మంత్రిగా ఉండగా ఆరోగ్య సమస్యల కారణంగా తాను మంత్రిగా కొనసాగానని చెప్పడంతో ఇప్పుడు మోడీ తన సెకండ్ ఆప్షన్ గా ఆర్ధిక మంత్రి పదవిని నిర్మలా సీతారామన్ కి ఇచ్చి ఆమె సామర్ధ్యాన్ని గౌరవించాడు.ఆర్ధిక శాస్త్రంలోనే పీజీ చేసిన ఆమెని ఆర్ధిక సంబంధమైన విషయాల మీద మంచి అవగాహన ఉంది.
ఇదిలా ఉంటే ఆర్ధిక మంత్రితో పాటు మరో కీలక శాఖ అయిన కార్పొరేట్ వ్యవహారాల శాఖ కూడా నిర్మలా సీతారామన్ కి మోడీ అప్పగించాడు.ఇక ఆర్ధిక మంత్రి పదవిని ఇందిరాగాంధీ తర్వాత చేపడుతున్న రెండో మహిళగా నిర్మలా సీతారామన్ అరుదైన గౌరవం సొంతం చేసుకున్నారు.