కేంద్ర ఆర్ధిక మంత్రి హోదాలో నిర్మలా సీతారామన్ నేడు పార్లమెంటులో బడ్జెట్ను ప్రవేశ పెట్టిన విషయం తెల్సిందే.ఆమె తన బడ్జెట్ ప్రసంగాన్ని ఏకంగా 2 గంటల 42 నిమిషాల పాటు కొనసాగించారు.
గత సంవత్సరం బడ్జెట్ ప్రవేశ పెట్టిన సందర్బంగా ఆమె 2 గంటల 15 నిమిషాలు ప్రసంగించారు.ఈసారి అత్యధికంగా ఎక్కువ సమయం ఆమె బడ్జెట్ ప్రసంగం చేసి రికార్డు సృష్టించారు.
ఇంకా రెండు పేజీల బడ్జెట్ ప్రసంగం మిగిలి ఉండగానే ఆమె బీపీ లో అవ్వడంతో చెమటలు పట్టి స్పీకర్ అనుమతితో తన ప్రసంగంను ముగించింది.
బడ్జెట్ ప్రతుల్లో ఉన్న ఆ చివరి రెండు పేజీలను చదివినట్లుగా భావించాలంటూ సభకు ఆమె విజ్ఞప్తి చేసింది.
బడ్జెట్ను అత్యధిక సమయం చదవడంతో రికార్డు సృష్టించిన నిర్మలా సీతారామన్ గారు తెలుగు రాష్ట్రాలకు కూడా మంచి కేటాయింపులు చేయడం ద్వారా తెలుగు ప్రజల ఆకాంక్షలను తీర్చితే బాగుండేది కదా అంటూ ప్రశ్నిస్తున్నారు.ఇదే సమయంలో నిర్మలా సీతారామన్ బడ్జెట్పై రాహుల్ గాంధీ స్పందిస్తూ సుదీర్ఘ సమయం కొనసాగిన ఈ బడ్జెట్ ప్రసంగం ఏమాత్రం ఆకట్టుకోలేదంటూ తేల్చి పారేశాడు.