పార్లమెంట్ లో మొట్టమొదటి మహిళా ఆర్ధిక మంత్రిగా తొలిసారిగా నిర్మలా సీతారామన్ రికార్డ్ సృష్టించబోతున్నారు.తొలిసారిగా ఒక మహిళ కేంద్ర ఆర్ధిక మంత్రి గా నిర్మలా సీతారామన్ తోలి బడ్జెట్ ని ప్రవేశపెట్టబోతున్నారు.
అయితే ఈ క్రమంలో ఆమె ఎప్పుడూ ఉండే సంప్రదాయాన్ని పక్కన పెట్టారు.బడ్జెట్ సమావేశాలు అనగానే ముందుగా కనిపించేది బ్రీఫ్ కేస్.
అది చూడగానే ఆ ఈ రోజు బడ్జెట్ సమావేశాలు అన్న విషయం ఇట్టే అర్ధమైపోతుంది.గత ఎన్నో సంవత్సరాలుగా బడ్జెట్ సమావేశాల్లో ఇదే సంప్రదాయం వస్తూ ఉంది.
అయితే తోలి మహిళా ఆర్ధిక మంత్రిగా పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నిర్మలా ఇప్పుడు ఆ పాత సంప్రదాయానికి కూడా స్వస్తి చెప్పారు.ఈ బడ్జెట్ సమావేశాల్లో ఆమె చేతిలో బ్రీఫ్ కేస్ బదులు ఓ రెడ్ కలర్ ఫోల్డర్ లో బడ్జెట్ పత్రాలను పట్టుకొని మీడియా ముందు కనిపించారు.
ఎప్పుడూ కూడా బ్రీఫ్ కేస్ లో బడ్జెట్ పత్రాలను పెట్టి భద్రంగా పార్లమెంట్ లోకి తీసుకెళ్లి బడ్జెట్ ప్రసంగాన్ని ఆర్ధిక మంత్రి ప్రారంభిస్తూ ఉంటారు.అయితే ఈ రోజు మాత్రం నిర్మలా ఒక రెడ్ కలర్ ఫోల్డర్ లో బడ్జెట్ పత్రాలను పట్టుకొని ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యాలయం నుంచి రాష్ట్రపతి భవన్ కు వెళ్లారు.రామ్ నాథ్ కోవింద్ కు బడ్జెట్ పత్రాల కాపీని అందజేసి అక్కడ నుంచి పార్లమెంట్ కు బయలుదేరి వెళ్లారు.మరి ఈరోజు ప్రవేశపెట్టబోయే బడ్జెట్ ఎలా ఉండబోతుందో చూడాలి.