కొంపలు ఆర్పుతున్న కరోనా వ్యాక్సిన్. తాజాగా 108 అంబులెన్స్‌ డ్రైవర్ మృతి.. ?

కరోనాకు మందు వేసుకుంటే ప్రాణాలు నిలబడతాయని ఆశించిన వారికి ఆశాభంగం ఎదురవుతుంది.కరోనాతో మరణించని వారి ప్రాణాలను కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవడం దురదృష్టకరం.

 Nirmal 108 Driver Death After Taking Covid Vaccine , Nirmal,108 Driver, Death, C-TeluguStop.com

ఇక గత నాలుగురోజుల క్రితం అట్టహాసంగా ప్రారంభించిన కరోనా వ్యాక్సిన్ పక్రియ సజావుగా సాగుతుందని భావిస్తున్న క్రమంలో దీని పల్ల పలువురి ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుండడంతో ప్రస్తుతం ప్రజల్లో ఆందోళన కలుగుతుందట.

రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ ముందుగా ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు ఇస్తున్న విషయం తెలిసిందే.

ఇందులో వైద్య సిబ్బంది, పారిశుధ్య సిబ్బందికి కోవిడ్ వ్యాక్సిన్ ఇస్తున్నారు.ఇంతవరకు బాగానే ఉన్నా పలు ప్రాంతాల్లో వ్యాక్సిన్‌ తీసుకున్న వారిలో కొందరు అస్వస్థతకు గురవుతుండగా, మరి కొందరు మృతిచెందారనే వార్తలు ప్రజలను అయోమయంలో పడేస్తున్నాయట.

ఈ నేపధ్యంలోతాజాగా తెలంగాణలో కరోనా వ్యాక్సిన్ తీసుకున్న 108 అంబులెన్స్‌ డ్రైవర్ చనిపోయాడట.నిర్మల్ జిల్లా కుంటాల మండలం ఒలా గ్రామానికి చెందిన విఠల్ రావు అనే వ్యక్తి నిన్న కుంటాల పీహెచ్‌సీలో వ్యాక్సిన్ వేయించుకున్నారు.

అదేరోజు రాత్రి అస్వస్థతకు గురవగా వెంటనే కుటుంబసభ్యులు నిర్మల్ ఏరియా ఆస్పత్రికి తరలించారట.అక్కడ విఠల్ చికిత్స పొందుతూ ‌మృతిచెందారట.కాగా ఈ మరణం పై స్పందించిన అధికారులు విఠల్ మృతికి కోవిడ్ వ్యాక్సినేషనే కారణమా? కాదా అనేది మాత్రం ఇప్పుడే చెప్పలేమంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube