గత పదేళ్లుగా నిర్భయ కేసు గురించి మాట్లాడుకుంటున్నాం.ఈ కేసులో నింధితులు అయిన నలుగురు దోషులుగా తేలారు.
వారికి జీవించే హక్కు లేదంటూ కోర్టు తీర్పు వచ్చింది.ఉరి శిక్ష పడి చాలా కాలం అవుతున్నా కూడా ఇంకా కూడా మీనమేషాలు లెక్కిస్తున్నారు.
చట్టంలో ఉన్న లొసుగులను వారు ఉపయోగించుకుంటూ వారిని కొందరు కాపాడే ప్రయత్నం చేస్తున్నారు.మొత్తానికి నిర్బయ దోషులు గత కొన్నాళ్లుగా ఉరిని తప్పించుకుంటూ వస్తున్నారు.
ముఖ్యంగా నిర్బయ దోషులను కాపాడుతున్న చట్టం ఒక శిక్షలో కేసు పడ్డ వారికి ఒకేసారి శిక్ష విధించాలి.అంటే నిర్బయ కేసులో శిక్ష పడ్డ వారు అంతా కూడా ఒకేసారి ఉరికంబం ఎక్కాలి.
కాని ఎవరో ఒకరు కోర్టుకు వెళ్లడం లేదంటే క్షమాభిక్ష కు వెళ్లడం చేస్తున్నారు.దాంతో ఒకరి తర్వాత ఒకరు ఉరికి వాయిదా పడేలా చేస్తున్నారు.ఆ కారణంగానే ఈ నలుగురు నిందితులను వేరు వేరుగా ఉరి వేసేలా ఆదేశాలు ఇవ్వాలంటే కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కోర్టును కోరుతున్నాయి.అందుకు కోర్టు రేపు విచారణ జరుపబోతున్నాయి.
ఒకవేళ అందుకు కోర్టు ఓకే చెప్తే నెల రోజుల గ్యాప్లో అంతా కూడా ఉరి కంబం ఎక్కబోతున్నారు.