దిల్లీలో నిర్భయపై అఘాయిత్యం చేసి చంపేసిన దోషులకు ఉరి శిక్ష పడి చాలా కాలం అయ్యింది.న్యాయ శాస్త్రంలో ఉన్న చిన్న చిన్న లొసుగులను పట్టుకుని ఈ దోషులు ఉరిని తప్పించుకుంటూ వస్తున్నారు.
ఇన్ని రోజులు ఉరి శిక్షను వాయిదాల మీద వాయిదాలు వేయించుకున్న దోషులకు ఫైనల్ వార్నింగ్ బెల్ మోగింది.ఈనెల 20వ తారీకున వారికి ఉరి శిక్షను అమలు చేయాల్సిందిగా దిల్లీ పటియాలా కోర్టు తీర్పు ఇచ్చింది.
గతంలో ఇదే కోర్టు వారి ఉరిని ఆపేసిన విషయం తెల్సిందే.
నిర్బయ దోషులు గత కొన్ని రోజులుగా మీడియాలో ప్రముఖంగా కనిపిస్తూ ఉరిని తప్పించుకుంటున్నారు అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో నెటిజన్స్ తీవ్ర స్థాయిలో మండి పడుతున్నారు.
ఇంకా ఎన్ని రోజులు వెయిట్ చేయాలి అంటూ ఆగ్రహంతో ఊగి పోతున్నారు.నడి రోడ్డు మీద అప్పటికి అప్పుడు చంపేయాల్సిన ఆ రాక్షసులను ఇన్ని సంవత్సరాలుగా మేపుతూ వారికి ఉరి వేయకుండా ఉండటమే దండగా అంటూ ప్రభుత్వాలపై చాలా ఆగ్రహంతో ఉన్నారు.
ఈ సమయంలోనే ప్రభుత్వం దోషులకు ఉరి శిక్ష అమలు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించి సఫలం అయ్యింది.ఈనెల 20వ తారీకున తెల్లవారు జామున వారికి ఉరి శిక్ష పడటం ఖాయం.