రామ్ చరణ్ ‘కొణిదెల ప్రొడక్షన్’ ను ప్రారంభించిన సమయంలో నాన్నతోనే కాకుండా ఇతర హీరోలతో కూడా సినిమాలను నిర్మించాలని భావిస్తున్నట్లుగా పేర్కొన్నాడు.అయితే అయదు సంవత్సరాలు అవుతున్నా కూడా ఇప్పటి వరకు బయట హీరోతో సినిమా తీయలేదు.
కనీసం చిరంజీవి కాకుండా మరో మెగా హీరోతో కూడా సినిమాను నిర్మించలేదు.ఎట్టకేలకు మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తో ఒక సినిమాను నిర్మించేందుకు రామ్ చరణ్ రెడీ అయ్యాడట.
అయితే ఈ సినిమాను కూడా సొంతంగా కాకుండా మరో నిర్మాతతో కలిసి చరణ్ నిర్మాణంలో పాలు పంచుకోబోతున్నాడు.
సైరా సినిమాతో నష్టాలు వచ్చినప్పటికి ఆచార్య సినిమాను నిర్మించేందుకు ముందుకు వచ్చాడు.
ప్రస్తుతం ఆచార్య సినిమాను రామ్ చరణ్ నిరంజన్ రెడ్డితో కలిసి నిర్మస్తున్నాడు.ఇక సాయి ధరమ్ తేజ్ తో మూవీని కూడా మరో నిర్మాతతో కలిసి నిర్మించబోతున్నాడు.
తేజ్ మూవీకి చరణ్ పెద్దగా పెట్టుబడి పెట్టేది ఏమీ లేదు.ఆయన బ్రాండ్ ఇమేజ్ ఆయనకు పెట్టుబడి.
చరణ్ నిర్మాత అంటే సినిమాకు విలువ పెరుగుతుంది.అందుకే సినిమా నిర్మాణంలో చరణ్ ను భాగస్వామ్యులను చేయాలని అభిప్రాయం వ్యక్తం అవుతుంది.
సన్నిహితులు మరియు మిత్రులు కోరిక మేరకు సాయి ధరమ్ తేజ్ మూవీ నిర్మాణంలో తన పేరు కు ఓకే చెప్పాడని తెలుస్తోంది.దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెళ్లడయ్యే అవకాశం ఉంది.
కొత్త దర్శకుడు ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నాడు.ప్రస్తుతం చేస్తున్న సోలో బ్రతుకే సోబెటర్ మరియు దేవా కట్టా మూవీ తర్వాత ఈ సినిమా ఉండే అవకాశం ఉందంటున్నారు.