సహజంగా పిల్లలకి ఆటపాటలు అంటే చాలా ఇష్టం.కాళీ సమయంలో పిల్లలు చదువుల మీదకంటే కూడా ఆటల వైపు ఎక్కువగా దృష్టి పెడుతూ ఉంటారు.
అయితే పెద్ద వాళ్ళు ఈ విషయంలో కొంచం చూసి చూడనట్లుగా ఉంటూ పిల్లల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.అయితే అమెరికాలోని ఓ సవతి తండ్రి మాత్రం తన భార్య కొడుకుపై అతి క్రూరంగా ప్రవర్తించాడు.
ఎనిమిదేళ్ళ తన పెంపుడు కొడుకు ఇంటికి ఆడుకుంటూ లేటుగా వచ్చాడని
తీవ్రంగా కొట్టడమే కాకుండా నేలపై గోధుమలు జాతికి చెందిన కొన్ని విత్తనాలు పోసి వాటిపై మోకాళ్ళతో కూర్చోబెట్టాడు.ఈ పనిష్మెంట్ కాసేపు అయితే పర్లేదు.
ఏకంగా 9 గంటలు కూర్చో పెట్టాడు.దాంతో పిల్లాడికి చర్మం తెగిపోయి తీవ్ర రక్త స్రవం అయ్యింది.
దాంతో రక్తంతో తడిచిన ఆ విత్తనాలు మొలకలెత్తాయి.కాసేపటికి తండ్రి పక్కకి వెళ్ళే సమయంలో పరుగు పరుగునా పక్క ఇంటికి వెళ్లి జరిగింది చెప్పగా వాళ్ళు ఆ పిల్లాడి కాళ్ళు చూసేసరికి ఒక్క సారిగా షాక్ అయ్యారు.
సాయం చేయమని పిల్లాడు అడుగగా వెంటనే పోలీసులకి ఫిర్యాదు చేశారు.వెంటనే పిల్లాడిని ఆసుపత్రికి తీసుకుని వెళ్ళగా అతడి మోకాలులో ఉన్న గింజలు అన్నీ తొలగించారు.ప్రస్తుతానికి ఆ బాలుడు సురక్షితంగానే ఉన్నాడని స్థానికులు తెలిపారు.అయితే బాబుని తల్లి అనుమతితోనే ఇలా శిక్షించానని చెప్పడంతో ఆమెని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.