నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీసుకుంటున్న నిర్ణయాలు ఏపీ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తున్నాయి.మొదటి నుండి వైసీపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే రీతిలో ఆయన నిర్ణయాలు ఉన్నట్లు మీడియాలో అదేవిధంగా రాజకీయాల టాక్ నడుస్తోంది.
ఇటువంటి తరుణంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి వైసిపి పార్టీ కీలక నాయకుడు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ని హౌస్ అరెస్ట్.ఈనెల 21 వరకు చేయాలంటూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ డీజీపీకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది.
మీడియాతో కూడా ఆయన మాట్లాడనివ్వకుండా గృహనిర్బంధం చేయాలని పోలీసులకు ఆదేశాలు ఇచ్చారు.దీంతో తాజా నిమ్మగడ్డ ఆదేశాలపై మంత్రి పెద్దిరెడ్డి కూడా తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.
చంద్రబాబు కోసం బంట్రోతు లాగా నిమ్మగడ్డ పని చేస్తున్నారు.ఇది ప్రజాస్వామ్యం అంటూ మంత్రి పెద్దిరెడ్డి.
నిమ్మగడ్డ తీసుకున్నా నిర్ణయాలపై మండిపడ్డారు.ఇదిలా ఉంటే నిమ్మగడ్డ ఇచ్చిన ఆదేశాలు డిజిపి పాటిస్తారా లేదా అన్నది ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో సస్పెన్స్ గా నెలకొంది.