ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని రేషన్ డోర్ డెలివరీ సరుకు రవాణా గురించి ఎస్ఈసీ నిమ్మగడ్డ అదేవిధంగా చంద్రబాబుపై తీవ్రస్థాయిలో తాడేపల్లి మీడియా సమావేశంలో కామెంట్లు చేయడం జరిగింది.పంచాయతీ ఎన్నికల ఫలితాల గురించి మాట్లాడిన కొడాలి నాని.
వైసిపి పార్టీ ప్రభంజనాన్ని ఆపలేక పోయారని ఎస్ఈసీ నిమ్మగడ్డ పై చంద్రబాబు పై విమర్శలు చేశారు.ఇద్దరు కలసి వచ్చిన గాని వైసీపీ పార్టీ విజయకేతనం ఎగర వేసిందని.
వీళ్లంతా జగన్నాథ రథ చక్రాల కింద రాబోయే రోజుల్లో నలిగిపోవడం గ్యారెంటీ అని భారీ డైలాగులు వేశారు.
దీంతో కొడాలి నాని ప్రెస్ మీట్ అయిన గంటల్లోనే ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆయనకి నోటీసులు పంపటం జరిగింది.
రేషన్ సరుకులు డోర్ డెలివరీ అంశంపై ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన చేసిన వ్యాఖ్యలు పరిశీలించటం జరిగిందని చేసిన కామెంట్లు ఎస్ఈసీ ని అవమానపరిచే విధంగా ఉన్నాయని నోటీసులో పేర్కొన్నారు.దీంతో మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలకి సాయంత్రం 5 గంటల లోపు వివరణ ఇవ్వాలని ఆదేశించారు.
వ్యక్తిగతంగా లేదా సహాయకుల చేతగాని వివరణ ఇవ్వటంతో పాటు బహిరంగ ప్రకటన కూడా చేయాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ కొడాలి నాని కి పంపించిన నోటీసుల్లో పేర్కొన్నారు.ఇదిలా ఉంటే గతంలోనే ఈ విధంగానే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కి ఎమ్మెల్యే జోగి రమేష్ కి నోటీసులు పంపటం జరిగింది.
కాగా తాజాగా కొడాలి నానికి నిమ్మగడ్డ తనదైన శైలిలో షోకాజ్ నోటీసులు జారీ చేయటంతో ఏపీ రాజకీయాల్లో ఈ పరిణామం పెద్ద హాట్ టాపిక్ అయింది.