మళ్లీ సుప్రీంకోర్టుకి వెళ్తాను అంటూ నిమ్మగడ్డ సంచలన వార్నింగ్..!!

ప్రభుత్వంలోని పెద్దలు రాజకీయ దాడి చేస్తున్నారు అంటూ స్టేట్ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆరోపించారు.సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా మంత్రులు వ్యవహరిస్తున్నారని వాళ్లని నిలువరించాలని గవర్నర్ కి నిమ్మగడ్డ లెటర్ రాశారు.

 Nimmagadda Sensational Warning That I Will Go To The Supreme- Court- Again  Nimm-TeluguStop.com

ముఖ్యంగా ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి ని  ప్రభుత్వ సలహాదారు పదవి నుంచి తప్పించాలని గవర్నర్ ని కోరారు.

వెంటనే ప్రభుత్వ పెద్దలను సరి చేయాలని లేకపోతే మళ్లీ సుప్రీంకోర్టు కి వెళ్ళాల్సి వస్తుంది అన్నట్టుగా నిమ్మగడ్డ లెటర్ లో గవర్నర్ దృష్టికి తన ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదిలా ఉంటే మంత్రి పెద్దిరెడ్డి మరికొంత మంది పెద్దలు రాజ్యాంగబద్ధ పదవులను అడ్డంపెట్టుకుని నిమ్మగడ్డ రమేష్ కుమార్.  చంద్రబాబుకి బంట్రోతు మాదిరిగా వ్యవహరిస్తున్నారని ఇటీవల కామెంట్లు చేయడం జరిగింది.

ఇలాంటి తరుణంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ నేరుగా గవర్నర్ కి మంత్రులను అదేవిధంగా ప్రభుత్వ సలహాదారులను టార్గెట్ చేసి లైట్ వార్నింగ్ ఇచ్చేటట్టు లెటర్ రాయడం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube