ఏపి రాష్ట్ర ఎన్నికల సంఘం నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వానికి మరో లేఖను రాశాడు.ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాద్ దాస్ ఆ లేఖను అందించాడు.
అందులో ప్రభుత్వ అధికారులు ఎవరు ఎన్నికల పర్యటనలో గాని ప్రచారంలో పాల్గొనరాదని, ప్రభుత్వం ఆఫీసులు గాని, ప్రభుత్వ వాహనాలు గాని రాజకీయనాయకులు ఉపయోగించకూడదని అన్నాడు.మంత్రులు, ప్రజాప్రతి నిదులు చేపట్టే ప్రతి పర్యటన ను పర్యటనలాగే భావించాలి తప్ప అధికార పర్యటనగా భావించకూడదు అని అన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో మంత్రులు, ఎంఎల్ఏ లు ఎవరు ఎన్నికల కోడ్ ఉల్లంఘించవద్దని అన్నాడు.ఎవరైనా అలాంటి ఉల్లంఘనలకు పాల్పడితే కఠిన శిక్షలు తప్పవని అన్నాడు.
విలేకరుల సమావేశం కోసం ప్రభుత్వ భవనాలను ఉపయోగించరాదని ఆ లేఖలో పాల్గొన్నాడు.నిమ్మగడ్డ లేఖపై రాష్ట్ర ప్రభుత్వం ఏ విదంగా స్పందిస్తుందో చూడాలి.
ఏపి లో ఎస్ఈసి వర్సెస్ రాష్ట్ర ప్రభుత్వం అనే విదంగా ఉంది.అయిన కానీ నిమ్మగడ్డ మాత్రం తనకున్న విధులను అమలు పరుస్తు దూసుకెళ్లుతున్నాడు.