సుప్రీంకోర్టు పంచాయతీ ఎన్నికలకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మంచి స్పీడ్ మీద ఉన్నారు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్.మొదటి నుంచి ఈ ఎన్నికల విషయంలో ప్రభుత్వం వర్సెస్ నిమ్మగడ్డ తరహా రీతిలో నువ్వా నేనా అన్నట్టుగా ఉండటంతో న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పుతో ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం తగ్గాల్సిన పరిస్థితి ఏర్పడింది.
దీంతో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో ప్రభుత్వ కార్యక్రమాలు చాలావరకు నిలిచిపోయాయి.
పరిస్థితి ఇలా ఉండగా ఎన్నికలు జరిగే రీతి అదేవిధంగా ఎన్నికల నామినేషన్ విషయం లో తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల కలెక్టర్లతో ఎస్పీలతో బుధవారంనాడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్లు సమాచారం.
ఏ విధంగా ఎలక్షన్లు జరపాలి అన్న రీతిలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ అధికారులకు దిశానిర్దేశం చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.మరోపక్క వ్యాక్సిన్ వేసుకున్న ఉద్యోగస్తులే ఎన్నికల విధులు నిర్వహించే పరిస్థితి ఉండటంతో ఈ విషయంపై ప్రభుత్వం కేంద్రం యొక్క సూచనలు తీసుకుంటుందని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పుకొచ్చారు.
ఎన్నికలు ఎప్పుడొచ్చినా వైసీపీ పార్టీ రెడీగా ఉందని కూడా స్పష్టం చేశారు.
.