ఏపీలో అధికార పార్టీ వైసీపీ నేతలకు నిద్ర లేకుండా చేస్తున్న ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తాజాగా అస్వస్థతకు గురయ్యారు.కంటికి ఇన్ఫెక్షన్ కావడం తో కాసేపట్లో చేపట్టాల్సిన కడప జిల్లా పర్యటనను వాయిదా వేసుకున్నారు.
ఈ క్రమంలో ఈరోజు ఉదయం 11 గంటలకు నిమ్మగడ్డ ఎల్ వి ప్రసాద్ కంటి ఆసుపత్రికి కంటి పరీక్షల నిమిత్తం వెళ్లనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
సరిగ్గా రేపు మొదటి దశ ఎన్నికలు జరగనున్న క్రమంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ కంటికి ఇన్ఫెక్షన్ రావటం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.ఇదిలా ఉంటే పంచాయతీ ఎన్నికలలో ఏకగ్రీవ లకు ప్రోత్సాహం కలపిస్తూ వైసీపీ ప్రభుత్వం ఆలోచన చేయగా, దానికి విరుద్ధంగా నిమ్మగడ్డ కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది.అదే సమయంలో వైసీపీ పార్టీలో కీలక మంత్రులను హౌస్ అరెస్టు చేయాలంటూ కూడా ఆదేశాలు ఇవ్వడం తెలిసిందే.
ఇటువంటి తరుణంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ కంటి పరీక్షల నిమిత్తం హాస్పిటల్ కి వెళ్లడం పట్ల ప్రభుత్వంపై విపక్ష పార్టీలకు చెందిన కొంతమంది నాయకులు అనుమానం వ్యక్తం చేస్తున్నట్లు వార్తలు ఏపీ మీడియా సర్కిల్స్ లో వినబడుతున్నాయి.
.