ఏపీ రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మ గడ్డ రమేష్ కుమార్ నేడు గవర్నర్ ను కలవనున్నాడు.సోమవారం నాడు రాష్ట్ర ప్రభుత్వం కు అనుకూలంగా పంచాయతీ ఎన్నికలను పోస్ట్ పోన్ చేయాలంటూ తీర్పు వెలువడిన సంగతి తెలిసిందే, ఈ విషయంను రాష్ట్ర ఎన్నికల సంఘం సీరియస్ గా తీసుకుంది.
అందుకే ఏపీ హై కోర్టు లో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ పై సింగిల్ జడ్జి ఇచ్చిన ధర్మాసనం ఉత్తర్వులను డివిజన్ బెంచ్ కు అప్పీల్ చేస్తూ ఎస్ఈసి తరుపు న్యాయవాది పిటిషన్ ధాఖలు చేశాడు.
ఈ విషయంను పరిగణలోకి తీసుకొని మంగళవారం నాడు ఉదయం సమయంలో విచారణ జరుపుతామని పేర్కొంది.
సింగిల్ బెంచ్ ఉత్తర్వులను, ఎన్నికల షెడ్యూలుపై ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ కు అప్పీల్ పై రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నేడు 11:30 నిమిషాలకు గవర్నర్ ను కలిసి వివరించే అవకాశం ఉంది.