ఏపీ పంచాయతీ ఎన్నికలు నిమ్మగడ్డ వర్సెస్ అధికార ప్రభుత్వం అనే విదంగా ప్రస్తుతం పరిస్థితి నెలకొన్నది.రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మ గడ్డ రమేశ్ కుమార్ ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేశాడు.
దీనిపై నోటిఫికేషన్ విడుదల చెయ్యాలిసిన అవసరం ఉన్నది.ఈ నేపథ్యంలో రాష్ట్ర పంచాయతీరాజ్ ఉన్నతాధికారులతో చర్చలు జరపడానికి ఈ రోజు మధ్యానం 3 గంటలకు సమావేశం నిర్వహించారు.కానీ ఈ సమావేశానికి పంచాయతీ రాజ్ అధికారులు అయిన గోపాలకృష్ణ ద్వివేది, గిరిజ శంకర్ లు హాజరు కాలేదు.3 గంటలకు జరగలిసిన సమావేషంను సాయంత్రం 5 గంటలకు పోస్ట్ పోన్ చేశాడు.
అప్పటికి పంచాయతీ రాజ్ అధికారులు రాకపోవడంతో వారి తీరుపై నిమ్మగడ్డ ఆగ్రహం గా ఉన్నాడు.అయితే 3 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ తో పంచాయతీ రాజ్ అధికారులకు మీటింగ్ ఉండటం వలన రాలేకపోయాం అని చెబుతున్నారు.
మరి ఈ విషయం పై ఎస్ఈసి ఏ విదంగా స్పందిస్తుందో చూడాలి.నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఎలాంటి చర్యలు తీసుకుంటాడో అనే విషయంపై అధికార ప్రతిపక్ష నాయకులు సైతం ఎదురు చూస్తున్నారు.