దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగిస్తోంది.రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది.
సామాన్యుల నుంచి సెలబ్రిటీస్ వరకూ అందరూ కరోనా బారిన పడ్డారు.ఇప్పటికే లెజెండ్ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనా బారిన పడి హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు.
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సైతం కరోనా బారిన పడ్డారు.ఇక అమితాబచ్చన్ కుటుంబం కరోనా బారిన పడి కోలుకుంది.
చాలా మంది సెలబ్రిటీ ప్రముఖులు కరోనా బారిన పడి కోలుకున్నారు.ఓ విధంగా చిత్ర పరిశ్రమని కరోనా తీవ్రంగా భయపెడుతుంది.
సెలబ్రిటీలకి కరోనా సోకడంతో వారు మిగిలిన వారు బయటకి వెళ్ళాలంటే హడలిపోతున్నారు.ఈ నేపధ్యంలో షూటింగ్ లలో కూడా పాల్గొనేది లేదని తేల్చేస్తున్నారు.
తాజాగా మరో సౌత్ ఇండియా హీరోయిన్ కరోనా బారిన పడింది.
తెలుగు, తమిళ, మలయాళంలో హీరోయిన్ గా వరుస సినిమాలతో బిజీగా ఉన్న హీరోయిన్ నిక్కీ గల్రానీకి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్టు ఆమె ట్విట్టర్ వేదికగా తెలిపింది.
ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు తెలిపింది.ఆమె తెలుగులో సునీల్ హీరోగా వచ్చిన కృష్ణాష్టమి ఆది పినిశెట్టితో మలుపు, మరకతమణి చిత్రాల్లో నటించారు.గత కొంత కాలం క్రితం నిక్కీ ఆది పినిశెట్టితో ప్రేమలో ఉందని, త్వరలో వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు అనే టాక్ వినిపించింది.ఈ విషయం వారు అఫీషియల్ గా కన్ఫర్మ్ చేయకున్న ఇది వాస్తవమే అనే మాట వినిపిస్తుంది.
కన్నడ హీరోయిన్ సంజన గల్రానీ చెల్లిగా నిక్కీ గల్రానీ హీరోయిన్ గా తెరంగేట్రం చేసింది.