బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన విషయం అందరికీ తెలిసిందే.ఈ ఘటనతో ఒక్కసారిగా సినీ ఇండస్ట్రీ ఉలిక్కిపడింది.
మంచి ఫాంలో ఉన్న హీరో ఇలా ఆత్మహత్య చేసుకోవడం ఏమిటా అని అందరూ ప్రశ్నించారు.కాగా ఈ హీరో మరణించడంతో ప్రేక్షకులతో పాటు పలువురు సినీ ప్రముఖులు తీవ్ర సంతాపం తెలిపారు.
అయితే సుశాంత్ సింగ్ మరణంపై కొందరు ఇండస్ట్రీలోని కొందరిని దుమ్మెత్తిపోస్తున్నారు.
ఇందులో ముఖ్యంగా బాలీవుడ్కు చెందిన కొందరు స్టార్స్ కావాలనే చిన్న రేంజ్ హీరోలను టార్గెట్ చేస్తున్నారని, అందుకే వారు తీవ్ర డిప్రెషన్లోకి వెళ్లి ఆత్మహత్యలు చేసుకుంటున్నారని పలువురు కామెంట్ చేస్తున్నారు.
తాజాగా టాలీవుడ్ బ్యూటీ నికిషా పటేల్ కూడా ఇదే తరహా కామెంట్స్ చేస్తోంది.పవన్ కళ్యాణ్ నటించిన ‘కొమురం పులి’ సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన నికిషా పటేల్, బాలీవుడ్లో బడా స్టార్స్గా వెలుగుతున్న వారు చిన్న, మీడియం రేంజ్ స్టార్స్ను చాలా చులకనగా చూస్తారని మండిపడింది.
సుశాంత్ విషయంలోనూ ఇదే జరగడంతో ఆయన ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పుకొచ్చింది.
ఇక పెద్ద పెద్ద మాటలు మాట్లాడే బాలీవుడ్ బిగ్ షాట్స్ సుశాంత్ అంత్యక్రియలకు ఎందుకు హాజరు కాలేదో చెప్పాలని ఆమె డిమాండ్ చేసింది.
ఇలాంటి వారి వళ్లే ఇండస్ట్రీకి చెడ్డపేరు వస్తుందని, అందుకే వారి చిత్రాలను ఆదరించడం మానేయాలని ఆమె ప్రేక్షకులను కోరింది.కాగా లాక్డౌన్ అనే సాకు చెప్పి సుశాంత్ అంత్యక్రియలకు హాజరుకాకపోవడం ఎంతవరకు సబబు అని ఆమె ప్రశ్నించింది.
ఏదేమైనా బాలీవుడ్ బడా షాట్స్ను నికీషా పటేల్ బాగానే ఏసుకుందని పలువురు నెటిజన్లు ఆమెను ప్రశంసిస్తున్నారు.