సుధీర్ వర్మ, నిఖిల్ సిద్ధార్థ్ కాంబోలో వచ్చిన సూపర్ హిట్ మూవీ స్వామిరారా.2013లో వచ్చిన ఆ సినిమా కమర్షియల్ గా మంచి సక్సెస్ అయ్యింది.ఇక ఈ సినిమా తర్వాత సుధీర్ వర్మ డైరక్షన్ లో నిఖిల్ మరో సినిమా చేశాడు.కేశవ టైటిల్ తో వచ్చిన ఆ సినిమా కమర్షియల్ గా వర్క్ అవుట్ కాలేదు కాని ప్రేక్షకులను అలరించింది.
ఇక కొద్దిపాటి గ్యాప్ తర్వాత స్వామిరారా కాంబో మరో సినిమా చేస్తుంది.ఈ సినిమాను బోగవల్లి ప్రసాద్ నిర్మిస్తున్నారు.
సుధీర్ వర్మ, నిఖిల్ ఇద్దరు కలిసి చేస్తున్న ఈ హ్యాట్రిక్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.స్వామిరారా హిట్.
కేశవ అంచనాలను అందుకోకపోయినా ఈ హ్యాట్రిక్ సినిమాను నెక్స్ట్ లెవల్ లో ఉండేలా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది.ఈ సినిమాను నవంబర్ 1 నుండి సెట్స్ మీదకు తీసుకెళ్తారని తెలుస్తుంది.
సినిమాలో మేజర్ పార్ట్ ఫారిన్ లొకేషన్స్ లో ఉంటుందని అంటున్నారు.మరి నిఖిల్ తో సుధీర్ వర్మ చేస్తున్న ఈ హ్యాట్రిక్ మూవీ అంచనాలను అందుకుంటుందా లేదా అన్నది చూడాలి.
డైరక్టర్ గా సరైన సక్సెస్ లు లేక వెనకపడ్డ సుధీర్ వర్మ ఈ సినిమాతో సత్తా చాటాలని చూస్తున్నాడు.