కరోనా టైమ్ లో పెళ్లి చేసుకొని కొత్త జీవితం స్టార్ట్ చేసిన యువ హీరో నిఖిల్ ఈ ఏడాది పరిస్థితులు కూడా అనుకూలించడంతో ఫ్యామిలీతో, అలాగే భార్యతో ఎక్కువ సమయం స్పెండ్ చేసే అవకాశం దొరికింది.ఇక ఈ సమయాన్ని నిఖిల్ కూడా భాగానే ఉపయోగించుకున్నాడు.
అయితే మరల సినిమా షూటింగ్ లకి పర్మిషన్ ఇవ్వడంతో సెట్స్ పైకి వెళ్లాలని అనుకుంటున్నాడు.ప్రస్తుతం నిఖిల్ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి వాటిలో సుకుమార్ ప్రొడక్షన్, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా తెరకెక్కనున్న 18 పేజెస్ లవ్ స్టొరీ ఒకటి కాగా చందూ మొండేటితో కార్తికేయ సీక్వెల్ ఒకటి.
అయితే కార్తికేయ సీక్వెల్ భారీ బడ్జెట్ తో ఎక్కువ మంది క్యాస్టింగ్ తో షూట్ చేయాల్సిన సినిమా కావడం వలన ప్రస్తుతం ఉన్న పరిస్తితులో నిఖిల్ దానిని కొంత కాలం పోస్ట్ పోన్ చేసాడని తెలుస్తుంది.ఇక కుమారి 21 ఎఫ్ దర్శకుడు పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో సుకుమార్ కథతో తెరకెక్కబోయే 18 పేజెస్ మూవీని సెట్స్ పైకి తీసుకెళ్ళడానికి ప్లాన్ చేసుకుంటున్నాడు.
ఇప్పటికే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా కంప్లీట్ చేసుకుంది.రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కబోతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ తో పాటు మరో ఇద్దరు భామల పేర్లు వినిపిస్తున్నాయి.
అయితే వీరిలో ఎవరిని కన్ఫర్మ్ చేసింది చిత్ర యూనిట్ ఇప్పటి వరకు ప్రకటించలేదు.అయితే షూటింగ్ మాత్రం వచ్చే నెలలో ప్రారంభించాలని అనుకుంటున్నారు.బడ్జెట్ గురించి స్పష్టత రావడంతో పాటు పరిస్థితులు అనుకూలించిన వెంటనే కార్తికేయ సీక్వెల్ మొదలు పెట్టాలని అనుకుంటున్నారు.ఏది ఏమైనా ఆ సినిమా స్టార్ట్ చేయడం వచ్చే ఏడాదిలోనే సాధ్యం అవుతుంది.
దీనిని దృష్టిలో ఉంచుకొని సుకుమార్ సినిమాతో షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నాడు.