మూస సినిమాలతో దాదాపు కెరియర్ అయిపోయింది అనుకుంటున్న సమయంలో సుధీర్ వర్మతో నిఖిల్ తీసిన స్వామిరారా ట్రెండ్ క్రియేట్ చేసింది.థ్రిల్లర్ర్ కథాంశంతో సాగిన ఆ సినిమా పరిశ్రమలో హేమా హేమీలు కూడా ముక్కున వేలేసుకునేలా చేసింది.2013 సూపర్ హిట్స్ లో స్వామిరారా ఒకటి.అయితే ఆ సినిమా తర్వాత నిఖిల్ ఆ హిట్ మేనియాను కంటిన్యూ చేశాడు కాని దర్శకుడు సుధీర్ మాత్రం నాగ చైతన్యతో దోచెయ్ అనే సినిమా తీసి ఫ్లాప్ మూటకట్టుకున్నాడు.
అయితే మరోసారి స్వామిరారా టీం సినిమా తీసేందుకు సిద్ధమవుతుందట.నిఖిల్ తో ఇప్పటికే కథా చర్చలు జరిపాడట డైరక్టర్ సుధీర్ వర్మ.మొన్నీమధ్య మాస్ మహరాజ్ రవితేజతో సుధీర్ వర్మ సినిమా ఉంటుందంటూ టాక్ వచ్చినా ప్రస్తుతం అది ఇంకా డిస్కషన్ స్టేజ్ లోనే ఉందని తెలుస్తుంది.అందుకే ముందు నిఖిల్ తో సినిమా తీసే ఆలోచనలో ఉన్నాడట సుధీర్ వర్మ.
అయితే ఓ పక్క ఇది స్వామిరారా సీక్వల్ గా వస్తుందంటూ వార్తలు వస్తున్నాయి.
అంతేకాదు స్వామిరారాకు పనిచేసిన కాస్ట్ అండ్ క్రూనే ఈ సినిమాకు వర్క్ చేయనున్నారట.
మరి ఆ లెక్కన నిఖిల్ మరోసారి స్వాతితో రొమాన్స్ చేస్తాడేమో చూడాలి.