కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడు నిఖిల్ ని కమర్షియల్ హీరోగా నిలబెట్టడానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.స్వతహాగా నిర్మాత అయిన కుమారస్వామి కొడుకు కోసం మొదటి సినిమాపైనే భారీగా ఖర్చు పెట్టారు.
జాగ్వార్ టైటిల్ తో తెలుగు, కన్నడ బాషలలో ఆ సినిమాని తెరకెక్కించారు.ఇక తెలుగు ప్రేక్షకులకి కొడుకుని పరిచయం చేయడం కోసం ఆ సినిమాలో పవర్ ఫుల్ విలన్ గా జగపతి బాబుని తీసుకొచ్చి పెట్టారు.
ఎన్ని చేసిన కథలో దమ్ము లేకపోవడం వలన ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది.కన్నడలో మాత్రం ఓ మోస్తారుగా ఆడింది.
తరువాత నాగ చైతన్య హిట్ మూవీ రారండోయ్ వేడుక చేద్దాం సినిమాని సీతారామ కళ్యాణ పేరుతో కన్నడలో రీమేక్ చేశారు.ఈ సినిమాతో అక్కడ హిట్ కొట్టాడు.
ఇక కన్నడలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన కురుక్షేత్ర సినిమాలో అభిమాన్యుడు పాత్రలో నిఖిల్ మెరిసాడు.కన్నడంలో కొంత వరకు ఈ యువ హీరో మూడు సినిమాలతో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు.
దానికి తోడు రాజకీయాలలో కూడా తన తండ్రికి వారసుడుగా ఎదిగేందుకు ప్రయత్నం చేస్తున్నాడు.
ఇదిలా ఉంటే తెలుగులో కూడా కమర్షియల్ హీరోగా తన ఇమేజ్ పెంచుకోవాలని ఈ కుర్ర హీరో భావిస్తున్నాడు.
ఈ నేపధ్యంలో తన కొత్త సినిమాని కన్నడంతో పాటు తెలుగులో కూడా తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నాడు.నితిన్ కెరియర్ లో సూపర్ హిట్ చిత్రమైన గుండె జారీ గల్లంతయ్యిందే సినిమాతో దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చిన విజయ్ కుమార్ కొండా దర్శకత్వంలో తన కొత్త సినిమాని ప్రకటించాడు.
కన్నడంలో ఫేమస్ మ్యూజిక్ కంపెనీగా ఉన్న లహరి మ్యూజిక్ కంపెనీ నిర్మాణంలోకి అడుగుపెడుతుంది.ఇప్పటి వరకు లవ్ స్టొరీ కథలతో టాలీవుడ్ లో దర్శకుడుగా ప్రూవ్ చేసుకున్న విజయ్ కుమార్ ఈ సారి నిఖిల్ తో యాక్షన్ బ్యాక్ డ్రాప్ కథతో సినిమాని తెరకెక్కిస్తున్నాడు.
ఈ సినిమాకి రైడర్ అనే టైటిల్ కన్ఫర్మ్ చేశారు.దీనికి సంబందించిన ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు.ఫస్ట్ లుక్ మోషన్ టీజర్ బట్టి యాక్షన్ భోనంజా గానే సినిమా ఉండబోతుందని తెలుస్తుంది. స్పోర్ట్స్ నేపధ్యంలో సాగే కథగా కనిపిస్తుంది.
మరి ఈ సినిమా ద్వారా విజయ్ కుమార్ కొండా నిఖిల్ కుమార్ కి ఎంత వరకు హిట్ ఇస్తాడు అనేది చూడాలి.