నిఖిల్ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా రూపొందిన కార్తికేయ 2 సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఈ సినిమా ను మొదటి రోజు ఉత్తర భారతంలో కేవలం 50 స్క్రీన్స్ లో వేయడం జరిగింది.
కాని ఇప్పడు సినిమా ఆరవ రోజుకు చేరుకునేప్పటికి ఏకంగా వెయ్యి స్క్రీన్స్ కి పెరిగింది.బాలీవుడ్ లో సినిమాలేవి కూడా పెద్దగా తోపు సినిమా లు లేవు.
అందుకే ఈ సినిమాను ఏకంగా వెయ్యి స్క్రీన్స్ లో ఆడించేందుకు అక్కడి బయ్యర్లు సిద్దం అయ్యారు.సినిమా జోరు చూస్తుంటే సినిమా యొక్క వసూళ్లు పుష్ప రేంజ్ లో ఉంటాయేమో అనిపిస్తుంది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
సోషల్ మీడియా లో కార్తికేయ 2 సినిమా యొక్క చర్చ పతాక స్థాయి లో జరుగుతుంది.కనుక ఈ సినిమా ను ఉత్తర భారతంలో ఎక్కువగా చూసేందుకు జనాలు ఆసక్తి చూపిస్తున్నారు.
యూనిట్ సభ్యులు కూడా పూర్తిగా ఉత్తర భారతం వైపు దృష్టి పెట్టారు.అక్కడ సినిమా భారీ ఎత్తున వసూళ్లు సాధిస్తుంది.అక్కడే ఎక్కువగా ప్రమోషన్ చేయడం ద్వారా భారీ వసూళ్ల దిశగా దూకు పోతుంది.
రికార్డు బ్రేకింగ్ వసూళ్లను ఈ సినిమా రాబట్టడం ఖాయం అంటూ నమ్మకం వ్యక్తం అవుతోంది.
ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా 50 కోట్లకు వసూళ్లు చేరుకున్నాయి.వసూళ్ల జోరు మామూలు గా లేదు.వసూళ్లు ప్రస్తుతం నెట్టింట సంచలనంగా మారింది.కేవలం 20 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా రాబడుతున్న వసూళ్లు చూస్తుంటే షాకింగ్ గా అనిపిస్తుంది అంటూ స్వయంగా యూనిట్ సభ్యులు చెబుతున్నారు.
సినిమా విడుదలకు ముందు చేసిన ప్రమోషన్ తో పోల్చితే ఇప్పుడు మరింత ఎక్కవుగా ప్రమోషన్ చేస్తూ బిజీగా ఉన్నారు. నిఖిల్ కి ఇది కెరీర్ లోనే బిగ్గెస్ట్ సక్సెస్ అంటూ కామెంట్స్ వస్తున్నాయి.