యంగ్ హీరో నిఖిల్ నటించిన కార్తికేయ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సూపర్ సక్సెస్ను అందుకుందో అందరికీ తెలిసిందే.పూర్తి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా వచ్చిన కార్తికేయ చిత్రం ప్రేక్షకులను మెప్పించడంలో పూర్తిగా సక్సె్స్ అయ్యింది.
ఇక ఈ సినిమాను దర్శకుడు చందు ముండేటి తెరకెక్కించిన విధానం ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది.ఇక ఈ సినిమాకు సీక్వెల్గా కార్తికేయ-2 చిత్రాన్ని తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ ఇప్పటికే రెడీ అవుతోన్న సంగతి తెలిసిందే.
ఇటీవల ఈ సినిమాను అఫీషియల్గా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.ఈ సినిమాను కూడా పూర్తిగా సస్పెన్స్ థ్రిల్లర్గా తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.అయితే ఈ సినిమా కోసం చిత్ర యూనిట్ భారీ బడ్జెట్ను కేటాయించేందుకు రెడీ అవుతోంది.ఈ సినిమాలో అదిరిపోయే రేంజ్లో వీఎఫ్ఎక్స్ పనులు ఉండబోతున్నాయని, వాటి కోసం ఏకంగా రూ.10 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.దేశంలోని వివిధ ఆలయాలకు సంబంధించిన బ్యాక్డ్రాప్తో ఈ కథ వస్తుండటంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.
ఇక కార్తికేయ చిత్రం అందుకున్న సక్సెస్ను మరోసారి రిపీట్ చేసేందుకు సీక్వెల్ను రెడీ చేస్తున్నారు చిత్ర యూనిట్.ఇక ఈ సినిమా షూటింగ్ను కేరళలోని అడవుల్లో మొదలుపెట్టేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.
ఈ సినిమాలో నిఖిల్ అదిరిపోయే లుక్లో కనిపిస్తాడని చిత్ర వర్గాలు అంటున్నాయి.ఇక ఈ సినిమాను దర్శకుడు చందూ ముండేటి ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఉండేలా చూస్తున్నాడని, ఈ సినిమాను వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.
మరి కార్తికేయ-2 చిత్రం ఎలా ఉంటుందో తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.