యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్ధ్ నటించిన లేటెస్ట్ మూవీ అర్జన్ సురవరం ఇటీవల రిలీజ్ అయ్యి మంచి టాక్ను సొంతం చేసుకుంది.ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా వాయిదా పడుతూ వస్తూ నవంబర్ 29న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయ్యింది.
సినిమా సక్సెస్ కావడంతో చిత్ర యూనిట్ హ్యాపీగ ఉన్నారు.కానీ కలెక్షన్స్ మాత్రం సినిమాకు చెప్పుకోతగ్గ స్థాయిలో రాలేదు.
ఈ క్రమంలో హీరో నిఖిల్కు ఓ దిమ్మతిరగే ఘటన ఎదురయ్యింది.తాజాగా అర్జున్ సురవరం విజయోత్సవ వేడుకలో పాల్గొన్న నిఖిల్ గుంటూరు నుండి తిరిగివస్తుండగా మార్గమధ్యలో టీ కోసం ఆగాడు.
అక్కడ జనాన్ని సినిమా చూశారా అని అడగ్గా సీడీలో చూశామని వారు చెప్పారు.ఆ పక్కనే సీడీలు అమ్ముతున్న ఓ బండి వద్ద జనం ఉండటం చూసిన నిఖిల్ అందులో కొత్త సినిమాలకు సంబంధించిన సీడీలన్నీ చూసి అవాక్కయ్యాడు.
దీంతో నిఖిల్ అక్కడున్నవారికి సినిమాలు పైరసీ సీడీల్లో చూడవద్దంటూ చెప్పుకొచ్చాడు.కొన్ని కోట్లు పెట్టి సినిమా తీస్తారు.
వారి కష్టాన్ని ఇలా దోచుకోవడం సబబు కాదంటూ నిఖిల్ అక్కడున్న ప్రజలను కోరాడు.ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.