యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ తను ప్రేమించిన అమ్మాయిని ఇరు కుటుంబాల అంగీకారంతో పెళ్లిచేసుకునేందుకు సిద్ధమయ్యారు.భీమవరంకు చెందిన డా.
పల్లవిని ప్రేమించిన నిఖిల్ ఫిబ్రవరిలో నిశ్చితార్థం చేసుకున్నాడు.ఏప్రిల్లో పెళ్లికి అన్ని ఏర్పాట్లను సిద్ధం చేసుకునే పనిలో నిమగ్నమయ్యాడు.
అయితే ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా నెలకొన్న లాక్డౌన్ ప్రభావం నిఖిల్ పెళ్లిపై కూడా పడింది.ఇప్పటికే మరో యంగ్ హీరో నితిన్, తన పెళ్లిని లాక్డౌన్ కారణంగా వాయిదా వేసుకున్న సంగతి తెలిసిందే.
కానీ నిఖిల్ మాత్రం చాలా తక్కువ మంది కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకోవాలని ప్రయత్నించాడు.కానీ ప్రస్తుతం పరిస్థితులు మరింత భయాందోళనకు గురిచేస్తుండటంతో తన పెళ్లిని కూడా నిఖిల్ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించాడు.
పెళ్లి వాయిదా వేయడం వల్ల కుటుంబ సభ్యులు చాలా నిరాశకు లోనయ్యారని, అయినా వారి ఆరోగ్యం చాలా ముఖ్యమైనది కాబట్టే తన పెళ్లిని వాయిదా వేస్తున్నానంటూ నిఖిల్ చెప్పుకొచ్చాడు.ప్రస్తుతం కరోనా మహమ్మారి బారిన పడకుండా ఉండాలంటే లాక్డౌన్ ఒకటే దిక్కని ఆయన చెప్పుకొచ్చాడు.
తన పెళ్లి ఎప్పుడనే విషయాన్ని పరిస్థితులు చక్కబడ్డాక తెలియజేస్తానని అన్నాడు.