టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ ప్రస్తుతం వరసబెట్టి సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు.తాజాగా ఆయన కార్తికేయ-2 చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.
గతంలో వచ్చిన కార్తికేయ చిత్రం ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే.దీంతో ఈ సినిమా సీక్వెల్పై ప్రేక్షకులతో పాటు సినీ వర్గాల్లో కూడా భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.
ఇక ఈ సినిమాను దర్శకుడు చందూ ముండేటి డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.
కాగా ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టగానే కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది.
ఇక ఈ సినిమా తరువాత తన నెక్ట్స్ మూవీని తెరకెక్కించేందుకు నిఖిల్ రెడీ అవుతున్నాడు.సుకుమార్ రైటింగ్స్ నుండి రాబోతున్న ‘18 పేజీస్’ అనే సినిమాలో నటించేందుకు నిఖిల్ రెడీ అవుతున్నాడు.
ఇక ఈ సినిమా తరువాత మరోసారి డైరెక్టర్ సుధీర్ వర్మతో ఓ సినిమా చేసేందుకు నిఖిల్ రెడీ అవుతున్నాడు.గతంలో స్వామిరారా, కేశవ లాంటి సూపర్ హిట్ చిత్రాలను అందించిన ఈ కాంబో, ఇప్పుడు ముచ్చటగా హ్యాట్రిక్ చిత్రాన్ని తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నారు.
ఇక ఈ సినిమాను పూర్తిగా థ్రిల్లర్ మూవీగా తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతున్నారు.అతి త్వరలోనే ఈ సినిమాను పట్టాలెక్కించేందుకు నిఖిల్, సుధీర్ వర్మలు రెడీ అవుతున్నారు.
కాగా ఈ సినిమాలో మిగతా నటీనటులు, సినిమా టైటిల్ లాంటి విషయాలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.ఇక నిఖిల్ వరుసగా సినిమాలను ఓకే చేస్తుండటంతో, ఆయన సినిమాల మధ్య ఎలాంటి వైవిధ్యాలను చూపిస్తాడో చూడాలని ప్రేక్షకులు అంటున్నారు.
మరి నిఖిల్తో ఈ సారి సుధీర్ వర్మ ఎలాంటి సినిమాతో వస్తాడో చూడాలి.