యంగ్ హీరో నిఖిల్ తన రూట్ మార్చుకున్న తర్వాత వరుస విజయాలు అందుకున్నాడు.స్వామీ రారా సినిమా నుంచి ఎక్కువగా కంటెంట్ బేస్, డిఫరెంట్ జోనర్ సినిమాలు చేస్తూ హీరోగా తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకుంటూ వచ్చాడు.
ఎక్కువగా డాన్స్ లు, కమర్షియల్ జోనర్ కథలు అంటూ పరుగులు పెట్టకుండా మంచి కథ, కథనం ఉన్న సినిమాలు చేస్తున్నాడు. నిఖిల్ చివరిగా అర్జున్ సురవరం సినిమాతో సూపర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.
కంప్లీట్ హోప్స్ వదిలేసిన తర్వాత ఈ సినిమా రిలీజ్ అయ్యి మంచి హిట్ టాక్ సొంతం చేసుకుంది.ప్రస్తుతం నిఖిల్ గీతా ఆర్ట్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న 18 పేజెస్ సినిమాలో నటిస్తున్నాడు.
ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.దీంతో పారు చందూ మొండేటి దర్శకత్వంలో కార్తికేయ 2ని భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో తెరపైకి తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు.
ఈ రెండు సినిమాలతో పాటు ఇప్పుడు స్వామీ రారాతో తన కెరియర్ టర్నింగ్ పాయింట్ లాంటి సినిమా అందించిన సుదీర్ వర్మ దర్శకత్వంలో సినిమా చేయడానికి ఒకే చెప్పాడు.ఈ సినిమా కథ ఇప్పటికే ఫైనల్ అయినట్లు తెలుస్తుంది.
కథ నేపధ్యం బట్టి మెజారిటీ షూటింగ్ లండన్ లో ఉంటుందని టాక్.లండన్ బ్యాక్ డ్రాప్ లో సినిమా కథ నడుస్తుందని, ఈ నేపధ్యంలో అక్కడే షూట్ చేయాల్సి ఉంటుందని తెలుస్తుంది.
అయితే బ్రిటన్ లో కరోన సెకండ్ వేవ్ ఉండటంతో అక్కడ లాక్ డౌన్ అమలవుతుందని, షూటింగ్ లకి కూడా ఎలాంటి పర్మిషన్స్ ఇవ్వడం లేదు.ఈ నేపధ్యంలో సుదీర్ వర్మ సినిమా స్టార్ట్ అవ్వాలంటే చాలా సమయం పట్టే అవకాశం ఉందని బోగట్టా.