యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కార్తికేయ 2 తర్వాత ఈయన పేరు దేశం అంతటా మారుమోగి పోయింది.
ఇక ఇంతటి బ్లాక్ బస్టర్ విజయం తర్వాత నిఖిల్ నెక్స్ట్ రాబోతున్న సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.ప్రెజెంట్ నిఖిల్ పలు క్రేజీ ప్రాజెక్టులలో నటిస్తున్నాడు.
అందులో 18 పేజెస్ ఒకటి.కార్తికేయ 2 జోడీనే ఈ సినిమాలో కూడా కనిపించ బోతున్నారు.
కుమారి 21F సినిమా ఫేమ్ సూర్య ప్రతాప్ పల్నాటి తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ కథ అందిస్తున్నాడు.స్టార్ డైరెక్టర్ సుకుమార్ కథ అంటే ఆ రేంజ్ లోనే ఉంటుంది అని అంతా భావిస్తున్నారు.
అందుకే ఈ సినిమాపై మంచి అంచనాలు పెరిగాయి.అసలైతే ఈ సినిమా కార్తికేయ కంటే ముందే రిలీజ్ కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది.
దీంతో ఈ సినిమాకు ఇప్పుడు కలిసి వస్తుంది అనే చెప్పాలి.
ఇక ఇటీవలే ఈ సినిమా నుండి వచ్చిన ఫస్ట్ సింగిల్ ఆకట్టుకుంది.
ఇక ఇప్పుడు సెకండ్ సింగిల్ గురించి ఒక అప్డేట్ బయటకు వచ్చింది.లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో సెకండ్ సాంగ్ ను ఒక స్టార్ హీరో చేత పాడించినట్టు టాక్.
.ఆ స్టార్ హీరో ఎవరంటే తమిళ్ లో స్టార్ హీరోగా వెలుగొందుతున్న శింబు.
ఈయన ఈ పాటను పాడినట్టు తెలుస్తుంది.”టైం ఇవ్వు పిల్ల టైం ఇవ్వు” అంటూ సాగే ఈ సాంగ్ ను శింబు పాడారట.మరి ఈ సాంగ్ ఎలా ఉంటుందో చూడాలి.ఇక ఈ సినిమాను గీతా ఆర్ట్స్ 2 పై బన్నీ వాసు నిర్మిస్తున్నారు.ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా గోపి సుందర్ సంగీతం అందిస్తుండగా.డిసెంబర్ 23న క్రిస్మస్ కానుకగా రిలీజ్ కాబోతుంది.
మరి ఈ సినిమా కూడా నిఖిల్ కెరీర్ లో బ్లాక్ బస్టర్ అందుకుంటుందో లేదో చూడాలి.