తమిళంలో వచ్చి తెలుగులో కూడా సూపర్ హిట్ అయిన చిత్రం ‘గజినీ’.ఆ సినిమాలో హీరో సూర్య తన గతంను మర్చి పోతాడు.
కొద్ది సమయం మాత్రమే గుర్తు వస్తుంది.అతడు ప్రేమించిన అమ్మాయిని చంపిన వారిపై పగ తీర్చుకునేందుకు చేసే సాహసాలే గజినీ చిత్రం.
ఆ సినిమా కాన్సెప్ట్ను కాపి కొట్టి, కొందరు ఇన్సిపిరేషన్గా తీసుకుని ఎన్నో సినిమాలు చేశారు.ఇప్పుడు మరో సినిమా తెలుగులో రాబోతున్నట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
నిఖిల్ హీరోగా సూర్య ప్రతాప్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘18 పేజెస్’.ఈ చిత్రం షూటింగ్ ఇటీవలే ప్రారంభం అయ్యింది.ఈ చిత్రం కథ గురించి రకరకాలుగా ప్రచారం జరిగింది.ఈ సినిమాను గీతా ఆర్ట్స్ వారు నిర్మిస్తున్న కారణంగా అంచనాలు భారీగా ఉన్నాయి.
అంచనాలకు తగ్గట్లుగా విభిన్నమైన కథాంశంతో దర్శకుడు సూర్య ప్రతాప్ తెరకెక్కిస్తున్నట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
ప్రస్తుతం కరోనా కారణంగా షూటింగ్ మొదలు కాలేదు.ఈ సమయంలోనే స్క్రిప్ట్ను మరింత పక్కాగా దర్శకుడు మల్చుతున్నాడట.ఆన్ లైన్లో అంతా కూడా స్టోరీ చర్చలు జరుపుతున్నారట.
సినీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో నిఖిల్ మెమోరీ లాస్ పేషంట్గా కనిపించబోతున్నాడట.గతం మర్చి పోయి ఇబ్బందులు పడుతున్న కుర్రాడిగా ఈయన కనిపించబోతున్నట్లుగా చెబుతున్నారు.
ఆ విషయమై క్లారిటీ రావాల్సి ఉంది.