మెగాడాటర్ నిహారిక, చైతన్యల వివాహ వేడుక ఈ నెల 9వ తేదీన రాజస్థాన్ లోని ఉదయ్ విలాస్ ప్యాలేస్ లో ఘనంగా జరిగిన సంగతి విదితమే.లాక్ డౌన్ నిబంధనల వల్ల పరిమిత సంఖ్యలో బంధుమిత్రుల మధ్య ఈ వేడుక జరిగింది.
అయితే పెళ్లికి తక్కువ మంది హాజరైనా రిసెప్షన్ వేడుకకు మాత్రం రాజకీయ, సినీ ప్రముఖులందరూ హాజరయ్యారు.అయితే నిహారిక చైతన్యలు కూడా కాజల్ గౌతమ్ లా హనీమూన్ కు మాల్దీవులకే వెళుతున్నారని సమాచారం.
ప్రస్తుతం నిహారిక చైతన్య తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాలను సందర్శిస్తున్నారు.కాజల్ గౌతమ్ తో పాటు పలువురు టాలీవుడ్ హీరోయిన్లు సైతం మాల్దీవులకు వెళ్లి అక్కడ వెకేషన్ ను బాగా ఎంజాయ్ చేశారు.
కాజల్ హనీమూన్ కు వెళ్లడం వల్ల మాల్దీవుల గురించి తెలుగు రాష్ట్రాల ప్రజల్లో చర్చ జరిగింది.మాల్దీవ్స్ ప్రభుత్వం సైతం అక్కడ టూరిజంను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో సినీ ప్రముఖులకు ఆకర్షణీయమైన ప్యాకేజీలను ఇస్తున్నట్టు తెలుస్తోంది.
అయితే మాల్దీవులతో పాటు మరికొన్ని ప్రాంతాలను కూడా ఛాయిస్ గా పెట్టుకున్నారని త్వరలో ఎక్కడికి వెళతారో ఫైనలైజ్ కానుందని తెలుస్తోంది.మాల్దీవ్స్ కు హనీమూన్ కు వెళ్లడం సాధారణ విషయమే అయినా ఈ మధ్య కాలంలో చాలామంది హీరోయిన్లు అక్కడికి వెళ్లడంతో ఈ పేరు మారుమ్రోగుతోంది.నిహారిక చైతన్యల హనీమూన్ వాళ్ల వ్యక్తిగతమే అయినా నిహారిక పెళ్లి వేడుకలు మొదలుకాక ముందు నుంచే ప్రతి విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు.
మరోవైపు నిహారిక నటిగా సినిమాలకు దూరం కానున్నారని నిర్మాతగా సినిమాల్లో కంటిన్యూ అవుతారని తెలుస్తోంది.
ఒక మనస్సు, హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం సినిమాల్లో నిహారిక హీరోయిన్ గా నటించగా ఈ మూడు సినిమాలు ఆశించిన స్థాయిలో ఫలితాన్ని అందుకోలేదు.