మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక చాలా విభిన్నమైన ఆలోచనలు కలిగిన వ్యక్తి అని చెప్పడంలో సందేహం లేదు.వయసు చిన్నదే అయినా ఆమె ఆలోచనలు మాత్రం చాలా పెద్దవిగా చెప్పుకుంటారు.
చాలా ఏళ్ల క్రితమే మా టీవీలో క్రియేటివ్ హెడ్గా వర్క్ చేసిన నిహారిక ఆ తర్వాత నటిగా పరిచయం అయ్యింది.ముద్దపప్పు ఆవకాయ్తో పాటు పలు షార్ట్ ఫిల్మ్స్ చేసింది.
ఫైనల్గా కుటుంబ పెద్దలందరిని ఒప్పించి సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టింది.ఇండస్ట్రీలో నిహారిక వరుసగా చిత్రాలు చేస్తూ వస్తోంది.
అయితే ఇప్పటి వరకు నిహారిక కమర్షియల్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకోలేక పోయింది.
నిహారిక ప్రస్తుతం ‘సూర్యకాంతం’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యింది.భారీ అంచనాల నడుమ రూపొందిన ఆ చిత్రం రేపు విడుదల కాబోతున్న నేపథ్యంలో నిహారిక మీడియాతో మాట్లాడుతూ తన భవిష్యత్తు ప్రణాళికను వెళ్లడించింది.ఆ సమయంలోనే తనకు చాలా ఇష్టం అయిన నిర్మాణ రంగంలో సెటిల్ అవ్వాలనుకుంటున్నట్లుగా ప్రకటించింది.
హీరోయిన్గా చేస్తూనే నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టాలని ఉందని నిహారిక చెప్పుకొచ్చింది.నిర్మాణ రంగంలో ఉండే ఒడిదొడుకులను నేను చూశాను.నాకు వాటి గురించి తెలుసు, కనుక నిర్మాణ రంగంలో ఛాలెంజింగ్ నిర్మాతగా గుర్తింపు తెచ్చుకోవాలనుకుంటున్నారు.త్వరలోనే 100 ఎపిసోడ్స్ ఒక వెబ్ సిరీస్ను తీసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాను.
ఆ తర్వాత సినిమాను కూడా నిర్మిస్తాను అంటూ నిహారిక చెప్పుకొచ్చింది.పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ అనే బ్యానర్లో నిహారిక సినిమాలు నిర్మించనుంది.