టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ ప్రస్తుతం వరుసగా సినిమాలను నిర్మిస్తూ బిజీగా ఉన్నాడు.ఇప్పటికే మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ ను హీరోగా పరిచయం చేస్తూ ఒక సినిమాను నిర్మిస్తున్నాడు.
స్టోరీ అందించి తన శిష్యుడితో సినిమాను చేయిస్తున్నాడు.మైత్రి వారితో కలిసి వైష్ణవ్ తేజ్ మూవీని భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నాడు.
ఒక వైపు వైష్ణవ్ తేజ్ మూవీ పట్టాలెక్కిందో లేదో వెంటనే నాగశౌర్య హీరోగా ఒక చిత్రాన్ని నిర్మించేందుకు సిద్దం అయ్యాడు.ఈసారి శరత్ మరార్తో కలిసి సినిమాను నిర్మించబోతున్నాడు.
నాగశౌర్య హీరోగా సుకుమార్ కథతో ఆయన శిష్యుడి దర్శకత్వంలో ఒక చిత్రం పట్టాలెక్కేందుకు సిద్దం అయ్యింది.
రెండు సినిమాలు ఇప్పటికే నిర్మిస్తున్న సుకుమార్ తాజాగా మెగా డాటర్ నిహారికతో ఒక సినిమాను చేసేందుకు సిద్దం అయ్యాడు.ఇప్పటికే నిహారిక కోసం ఒక మంచి లేడీ ఓరియంటెడ్ కాన్సెప్ట్ ను రెడీ చేశాడట.తన శిష్యుడితో ఈ చిత్రాన్ని కూడా తీయించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు.
ఈ చిత్రాన్ని నాగబాబు మరియు బన్నీ వాసులు కలిసి సుకుమార్తో నిర్మిస్తున్నారు.దాదాపు 10 కోట్ల బడ్జెట్ను ఈ చిత్రంకు అనుకుంటున్నట్లుగా సమాచారం అందుతోంది.
నిహారికకు పది కోట్ల బడ్జెట్ అంటే చాలా చాలా ఎక్కువ.కాని కాన్సెప్ట్పై ఉన్న నమ్మకంతో ఈ చిత్రాన్ని నాగబాబు కూడా నిర్మించేందుకు సిద్దం అయ్యాడు.
ఇక మరో వైపు సుకుమార్ ‘రంగస్థలం’ చిత్రం తర్వాత మహేష్ బాబుతో సినిమాను చేయాల్సి ఉంది.రంగస్థలం విడుదల అయ్యి 11 నెలలు కావస్తుంది.అయినా కూడా సుకుమార్ తదుపరి ప్రాజెక్ట్ పై క్లారిటీ రాలేదు.మహేష్ బాబు మూవీ క్యాన్సిల్ అయినట్లుగా వార్తలు వస్తున్నాయి.అయితే అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.దర్శకుడిగా చాలా స్లోగా ఉన్న సుకుమార్ నిర్మాతగా మాత్రం జోరు కనబర్చుతున్నాడు.