ఈ మధ్య కాలంలో ఏ సెలబ్రిటీ వివాహం జరగనంత ఘనంగా నిహారిక చైతన్యల వివాహం జరిగిన సంగతి తెలిసిందే.మూడు రోజుల పాటు నిహారిక చైతన్యల వివాహం గురించే నెటిజన్ల మధ్య ఎక్కువగా చర్చ జరిగింది.
మెగాడాటర్ నిహారిక, చైతన్యల జంట చిలుకాగోరింకల్లా చూడముచ్చటగా ఉందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.నిహారిక తల్లి పద్మజ తాజాగా మీడియాతో కూతురు పెళ్లికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
నిహారిక పెళ్లికి మూడు రోజుల ముందు తనకు జ్వరం వచ్చిందని దీంతో పెళ్లి పనులు అన్నీ నాగబాబు, వరుణ్ తేజ్ చూసుకున్నారని ఆమె తెలిపారు.గారాలపట్టి నిహారిక పెళ్లి చేసుకుని మరో ఇంటికి కోడలు అయిందని ఇప్పటికీ తాను నమ్మలేకపోతున్నానని ఆమె చెప్పారు.
నిహారిక పెళ్లి పనులు మొదలైనప్పటి నుంచి గతంలో ఎప్పుడూ చూడనంత సంతోషంగా కనిపిస్తోందని పద్మజ తెలిపారు.
అందరు తల్లిదండ్రులు కూతురి పెళ్లిని గ్రాండ్ గా జరపాలని అనుకుంటారని.
మా కుటుంబం కూడా నిహారిక పెళ్లిని ఘనంగా చేయాలని అనుకుందని అనుకున్న విధంగానే పెళ్లి జరగడంతో ఎంతో సంతోషంగా ఉందని ఆమె అన్నారు.మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనే విధంగా నిహారిక చైతన్యల జంట ఉందని వాళ్లిద్దరినీ చూస్తే పెళ్లిళ్లు నిజంగానే స్వర్గంలో నిర్ణయిస్తారని తనకు అనిపిస్తోందని ఆమె అన్నారు.
చైతన్య లాంటి ఆదర్శవంతమైన భర్త నిహారికకు దొరకడంతో తాను ఎంతో సంతోషిస్తున్నానని.నిహారిక, చైతన్య ఆలోచనలు, అభిరుచులు ఒకే విధంగా ఉంటాయని పద్మజ వెల్లడించారు.
తన నిశ్చితార్థపు చీరలో నిహారిక పెళ్లికూతురుగా కనిపించడంతో కూతురును చూడగానే భావోద్వానికి గురై కన్నీళ్లు వచ్చాయని పద్మజ తెలిపారు.తనతో పాటు భర్త నాగబాబు కూడా కన్నీళ్లు పెట్టుకున్నారని.
కూతురును తన చీరలో పెళ్లికూతురుగా చూడటం అపూరమైన క్షణం అని పద్మజ తెలిపారు.