మెగా డాటర్ నిహారిక, జొన్నలగడ్డ చైతన్యలకు గతేడాది డిసెంబర్ నెల 9వ తేదీన రాజస్థాన్ లోని ఉదయ్ విలాస్ పాలేస్ లో ఘనంగా వివాహం జరిగిన సంగతి తెలిసిందే.ఢీ షోకు యాంకర్ గా పని చేసి, ఆ తరువాత పలు వెబ్ సిరీస్ లలో నటించి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన నిహారిక సినిమాల ద్వారా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు.
గత నెలలో నిహారికకు పెళ్లి జరగడంతో నిహారిక ఇకపై సినిమాలు, వెబ్ సిరీస్ లలో నటించదని గాసిప్స్ తెగ వైరల్ అయ్యాయి.
అయితే నిహారిక వైరల్ అవుతున్న గాసిప్స్ కు, రూమర్లకు చెక్ పెడుతూ మళ్లీ వెబ్ సిరీస్ తో బిజీ అవుతున్నారు.
నిన్న లాంఛనంగా ఈ వెబ్ సిరీస్ ప్రారంభం కాగా ఫాంటసీ డ్రామాగా ఈ వెబ్ సిరీస్ తెరకెక్కనుందని తెలుస్తోంది.అత్తింటి వారి నుంచి నిహారిక వెబ్ సిరీస్ లలో నటించడానికి ఆంక్షలు లేకపోవడంతో మళ్లీ నిహారిక వెబ్ సిరీస్ లతో బిజీ అయ్యారని సమాచారం.
ఈ వెబ్ సిరీస్ లో అనసూయ కూడా నటించనున్నారని తెలుస్తోంది.
వెబ్ సిరీస్ లో నటించడం గురించి నిహారిక మాట్లాడుతూ తాను మళ్లీ వర్క్ మోడ్ లోకి వచ్చేశానని.మళ్లీ షూటింగ్ లతో బిజీ కావడంతో చాలా ఎగ్జైటెడ్ గా ఉన్నానని నిహారిక పేర్కొన్నారు.నటన ద్వారా మంచి మార్కులు సొంతం చేసుకున్న నిహారిక ముద్దపప్పు ఆవకాయ్, నాన్న కూచి వెబ్ సిరీస్ ల ద్వారా మంచి పేరు సంపాదించుకున్నారు.
నిహారిక నటిస్తున్న ఈ కొత్త వెబ్ సిరీస్ లో యూట్యూబర్ నిఖిల్ విజయేంద్ర నటిస్తున్నారు.
ఈ వెబ్ సిరీస్ కు ప్రముఖ సంగీత దర్శకుడు కళ్యాణి మాలిక్ సంగీతం అందిస్తుండగా రాయుడు చిత్రాలు బ్యానర్ పై భాను రాయుడు ఈ వెబ్ సిరీస్ ను నిర్మిస్తున్నారు.
నిహారిక, అనసూయల పాత్రలకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.త్వరలోనే ఈ వెబ్ సిరీస్ షూటింగ్ ప్రారంభం కానుంది.
పెళ్లి తర్వాత నిహారిక నటిస్తున్న వెబ్ సిరీస్ కావడంతో ఈ వెబ్ సిరీస్ పై భారీగా అంచనాలు నెలకొన్నాయి.