ఈ ఏడాదిలో సిని నటీనటులు వరుసగా పెళ్ళిళ్ళు చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే.ఈ కరోనా నేపథ్యంలో అతి తక్కువ మంది తో అయినా నటీనటులు పెళ్లికి సిద్దం అయ్యారు.
కాగా ప్రస్తుతం మెగా ఫ్యామిలీ ప్రిన్సెస్ కొణిదెల నిహారిక పెళ్లి అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే.
కొణిదెల నాగబాబు కుమార్తె నిహారిక పెళ్లి గుంటూరు ఐ జీ జె.ప్రభాకర్ రావు తనయుడు జొన్నలగడ్డ వెంకట చైతన్య తో ఉదయపూర్ లోని డిసెంబర్ 9న మెగా సమక్షంలో జరిగింది.కాగా ఈ పెళ్లి కి సంబంధించిన ఐదు రోజుల వేడుకలలో జరిగిన సందడిల ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాను వేదికగా చేసుకొని ఎప్పటికప్పుడు మెగా ఫ్యామిలీ పోస్ట్ చేయడంతో వీడియోస్ హల్ చల్ అయ్యాయి.
కాగా నిహారిక పెళ్లి డెస్టినేషన్ గా చేయడానికి కొన్ని కారణాలు ఉన్నాయని నాగబాబు తెలిపారు.
మెగా ఫ్యామిలీ లో ఇంతకు ముందు జరిగిన పెళ్లి సందడి లను పోలిస్తే ఈ పెళ్లి చాలా వేడుకలతో జరిగిందని తెలుస్తుంది.కరోనా నేపథ్యంలో అతి తక్కువ మంది తో జరుగుతున్న కారణంగా ఈ పెళ్లిని డెస్టినేషన్ గా చేయడానికి మెగా ఫ్యామిలీ నిర్ణయించుకుంది.రామ్ చరణ్, అల్లు అర్జున్ పెళ్లి వేడుకలో ఎక్కువమంది గెస్టు లతో బిజీగా ఉండడం వల్ల ఇలాంటి వేడుకలు జరుపుకో లేక పోయామని అంతేకాకుండా ఎంజాయ్ చేసే అవకాశం లేక పోయేసరికి… ఈ పెళ్లిని ఈ విధంగా నిర్ణయించుకున్నామని, ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ కు నిహారిక చైతన్య ల ఒప్పందంతో చేశామని నాగబాబు తెలిపారు.
కాగా ఈ పెళ్లికి 120 మంది హాజరు తో ఆహ్వానం అందించగా ఐదు రోజుల పెళ్లి వేడుకలు ఘనంగా జరిగాయని తెలిపారు.