మెగా డాటర్ నిహారిక, చైతన్యల వివాహం ఈ నెల 9వ తేదీన రాత్రి 7.15 గంటలకు జరగబోతున్న సంగతి తెలిసిందే.పెళ్లికి ఇంకా ఐదు రోజులు ఉండగా మెగా డాటర్ ప్రీ వెడ్డింగ్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.రాజస్థాన్ లో ఉదయ్ పూర్ లో ప్యాలేస్ లో ఘనంగా వివాహం జరగనుంది.
ఈ ప్యాలేస్ ఆసియాలోనే రెండో పెద్ద ప్యాలేస్ కావడం గమనార్హం.తాజాగా నిహారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా కొన్ని ఫోటోలను షేర్ చేసింది.
ఆ ఫోటో చూస్తే నిహారిక కాళ్లపై ఇద్దరు యువతులు పడినట్టు కనిపిస్తోంది.ఇద్దరు యువతులు కాళ్లపై పడిన ఫోటో గురించి నిహారిక స్పందిస్తూ వాళ్లు తన హీల్స్ సరి చేస్తున్నారని పేర్కొంది.
వాళ్లిద్దరూ తనకు డ్రస్సెస్, మేకప్ విషయంలో ఇద్దరు సహాయం చేస్తున్నారని.వాళ్లు లేకపోతే తాను చాలా ఇబ్బంది పడేదానినని వెల్లడించింది.లవ్ యూ గర్ల్స్ అంటూ వాళ్ల గురించి నిహారిక కామెంట్ పెట్టింది.ఈ పెళ్లికి పరిమిత చిరంజీవి కుటుంబానికి అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరు కానున్నారు.
అయితే హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించే రిసెప్షన్ కు మాత్రం సినీ ప్రముఖులను, రాజకీయ నాయకులను, ఫ్యాన్స్ ను ఆహ్వానించారని సమాచారం.మెగా కుటుంబానికి చైతన్య కుటుంబంతో ఎప్పటినుంచో అనుబంధం ఉంది.
చిరంజీవి నాన్న, చైతన్య తాతయ్య మంచి స్నేహితులని సమాచారం.మెగా ఫ్యామిలీ నుంచి అందరు హీరోలు వివాహ వేడుకకు హాజరు కానున్నారు.
నిహారికకు కాబోయే భర్త చైతన్య జొన్నలగడ్డ ప్రముఖ ప్రముఖ ఐటీ కంపెనీలో పని చేస్తున్నారు.అంగరంగ వైభవంగా ఈ పెళ్లి వేడుక జరగనుందని తెలుస్తోంది.
పవన్ కళ్యాణ్ పెళ్లికి రెండు రోజుల ముందు వెళ్లనున్నారని తెలుస్తోంది.నిహారిక ప్రీ వెడ్డింగ్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.