రాజస్థాన్ లో రాజ మహల్ లో నిహారిక మరియు చైతన్యల వివాహ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది.వీరిద్దరు కలలు కన్నట్లుగా వివాహం జరిగింది.
అయితే రాజస్థాన్ లో వివాహం జరగడంతో చాలా మంది సినిమా పరిశ్రమకు చెందిన అతిరథ మహారథులు హాజరు అవ్వలేక పోయారు.కేవలం మెగా ఫ్యామిలీకి చెందిన వారు మాత్రమే రాజస్థాన్ వెళ్లారు.
అక్కడ మెగా ఫ్యామిలీ చేసిన సందడి సోషల్ మీడియాలో చూశాం.పెళ్లికి ముందు రోజు పవన్ కూడా తన ఇద్దరు పిల్లలను వెంట పెట్టుకుని వెళ్లాడు.
ఇతరులు పెళ్లి వేడుకను మిస్ అయ్యారు.అభిమానులు మరియు సినీ ప్రముఖుల ఆశీర్వాదాలు కొత్త జంటకు కావాలనే ఉద్దేశ్యంతో మెగా ఫ్యామిలీ ఈనెల 11 వ తారీకున అంటే రేపు హైదరాబాద్ లోని ప్రముఖ కన్వెన్షన్ లో ఏర్పాటు చేయడం జరిగింది.
ఇప్పటికే సినీ ప్రముఖులు పలువురికి ఆహ్వానం అందినట్లుగా సమాచారం అందుతోంది.పెళ్లికి ముందే దీనిని ప్లాన్ చేశారు.పెళ్లి ఆహ్వాన పత్రికతో పాటు రిసెప్షన్ విషయంలో కూడా క్లారిటీ ఇచ్చారు.అందుకే కొందరు హైదరాబాద్ లో రిసెప్షన్ కు వెళ్ల వచ్చు అంటూ రాజస్థాన్ వెళ్లలేదు అంటున్నారు.
మొత్తానికి నాలుగు రోజులుగా పెళ్లి హడావుడి ఉండగా మళ్లీ రేపు మెగా అభిమానులు మరియు సినీ ప్రముఖుల కోసం మెగా ఫ్యామిలీ ఏర్పాటు చేసిన రిసెప్షన్ వేడుక మరింత హైలైట్ గా నిలుస్తుందని ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఈ రిసెప్షన్ కు మీడియా మరియు సినీ ప్రముఖులు ఇంకా ముఖ్యమైన అభిమానులు జనసైనికలు హాజరు అయ్యే అవకాశం ఉందని అంటున్నారు.
హైదరాబాద్ లో రేపు జరుగబోతున్న రిసెప్షన్ కార్యక్రమం తర్వాత కొత్త దంపతులు మాల్దీవులకు హనీమూన్ కోసం వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు.