మెగా డాటర్ నిహారిక కొణిదెల, చైతన్య జొన్నలగడ్డ వివాహం జరగడానికి మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉంది.ఈరోజు రాత్రి 7.15 గంటలకు రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ ఉదయ్ విలాస్లో నిహారిక చైతన్యల వివాహం జరగనుంది.అయితే నిహారిక చైతన్యల పెళ్లి కోసం మెగా ఫ్యామిలీ ఎంత ఖర్చు చేస్తుందనే ప్రశ్నకు ఆశ్చర్యకరమైన సమాధానాలు వినిపిస్తున్నాయి.
వివాహ వేడుకకు కరోనా నిబంధనల నేపథ్యంలో పరిమిత సంఖ్యలో బంధుమిత్రులు హాజరవుతున్నా మెగా ఫ్యామిలీ ఖర్చుకు వెనుకాడటం లేదు.
ఉదయ్ పూర్ లోని ఉదయ్ విలాస్ లో పెళ్లి అంటే ఆషామాషీ వ్యవహారం కాదు.
రాజకీయ, సినీ ప్రముఖులు అరకోటికి పైగా ఖర్చు చేస్తే మాత్రమే అక్కడ వివాహ వేడుక జరపడం సాధ్యమవుతుంది.ఉదయ్ పూర్ లోని ఉదయ్ విలాస్ కు రోజుకు 20 లక్షల వరకు ఖర్చవుతుందని మెగా ఫ్యామిలీ మూడు రోజుల వివాహ వేడుక కోసం 60 లక్షల రూపాయలు ఖర్చు చేసిందని సమాచారం.
డెస్టినేషన్ వెడ్డింగ్ కావడంతో సౌకర్యాలు, ప్రయాణ ఖర్చులు అన్నీ కలిపి కోటిన్నర నుంచి రెండు కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తొంది.
ఈ పెళ్లి వేడుక కోసం ఎన్నో స్పెషల్ వంటకాలు తయారు చేయించినట్టు సమాచారం.నాగబాబు గారాలపట్టి నిహారిక కోసం ఖర్చుకు ఏ మాత్రం వెనుకాడలేదని తెలుస్తోంది.మరోవైపు పవన్ కళ్యాణ్ ఈ పెళ్లి వేడుకకు హాజరవుతాడో లేదో అనే ప్రశ్నలు వ్యక్తం కాగా నిన్న ఉదయ్ పూర్ కు చేరుకుని పవన్ పెళ్లి వేడుకల్లో భాగమయ్యారు.
మెగా, అల్లు ఫ్యామిలీలు దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
పవన్ కళ్యాణ్ తో పాటు కొడుకు అకీరా నందన్ పెళ్లి వేడుకకు హాజరు కాగా రేణు దేశాయ్ మాత్రం హాజరు కాలేదు.భారీ బడ్జెట్ తో వివాహ వేడుక ఘనంగా జరుగుతుండగా హైదరాబాద్ లో జరిగే రిసెప్షన్ ను కూడా అంతే గ్రాండ్ గా నిర్వహించనున్నారని తెలుస్తోంది.