సాధారణంగా మహిళలు గర్భం దాల్చగానే వారిని వైద్యులు ఎక్కువగా రెస్ట్ తీసుకోమని చెబుతారు.అలా నెలలు నిండిన కొద్ది ఆ అమ్మాయిని ఏ పని చేయనీయకుండా చూసుకుంటారు.
కానీ చాలా అరుదుగా మాత్రమే కనిపించే మహిళలు కొందరు మాత్రం డెలివరీ అయ్యేవరకు రెస్ట్ అనేది పక్కన పెట్టి ఏదో ఒకపని చేస్తుంటారు.అలాచేసే వారు ఎంతో యాక్టివ్గా కనిపిస్తారు.
ఇదంత పక్కన పెడితే ప్రస్తుతం ఎనిమిది నెలల గర్భిణి ఏం చేస్తుంది.హాయిగా తింటూ ఇంటిపని వంటపని చేసుకుని రెస్ట్ తీసుకుంటుంది.కానీ ఇప్పుడు మనం చదవబోయే మ్యాటర్లోని 26 ఏళ్ల అమితాస్ ఇద్రిస్ అనే మహిళ అలా చేయలేదు.అసలే చేయకూడని పనిని దృఢమైన సంకల్పంతో చేసి పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమేనని నిరూపించింది.
ఆ వివరాలు చూస్తే.
నైజారియాకు చెందిన 26 ఏళ్ల అమితాస్ ఇద్రిస్ అనే మహిళ ఎనిమిది నెలల బిడ్డను గర్భంలో దాచుకుని, నైజీరియాలో జరిగిన స్పోర్ట్స్ ఫెస్టివల్ లో భాగంగా తైక్వాండో పోటీల్లో పాల్గొని మిక్స్ డ్ పూమ్సే కేటగిరీలో స్వర్ణపతకం సాధించింది.
ఇదే కాకుండా మరో మూడు విభాగాల్లో కూడా పతకాలు సొంతం చేసుకోవడంతో ఒక్క సారిగా అందరి దృష్టిని ఆకర్శించింది.ఇక అమితాస్ సంకల్పంపై ఇప్పుడు సర్వత్ర ప్రశంసలు కురిపించని వారు లేరు.