టాలీవుడ్ లో హాట్ బ్యూటీగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సొంతం చేసుకున్న అందాల భామ నిధి అగర్వాల్.బాలీవుడ్ లో హీరోయిన్ గా కెరియర్ ప్రారంభించిన ఈ అమ్మడు తరువాత సవ్యాసాచి సినిమాతో తెలుగులోకి తెరంగేట్రం చేసింది.
తరువాత వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా వరుసగా ఆఫర్స్ ని సొంతం చేసుకుంటుంది.ప్రస్తుతం ఈ అమ్మడు పవర్ కళ్యాణ్ సరసన హరిహర వీరమల్లు సినిమాలో నటిస్తుంది.
ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది.దీంతో మాటు మరో రెండు, మూడు చిన్న సినిమాలు కూడా చేస్తుంది.
ఇదిలా ఉంటే ఈ అమ్మడు అందాల ప్రదర్శనతో సోషల్ మీడియాలో హాట్ ఫోటోషూట్ లు పెడుతూ అందరిని ఆకర్షిస్తూ ఉంటుంది.దీంతో సోషల్ మీడియాలో నిధిని ఫాలో అయ్యేవారు చాలా మంది ఉన్నారు.
అయితే ఈ బ్యూటీ తనకి అందంతో పాటు సామాజిక దృక్పథం కూడా ఉందని కరోనా సెకండ్ వేవ్ సమయంలో తన గొప్ప మనసు చాటుకోవడం ద్వారా నిరూపించుకుంటుంది. తమిళనాడు ప్రభుత్వానికి కరోనా పోరుకి లక్ష రూపాయిల విరాళం అందించడంతో పాటు తాను ఉంటున్న ప్రాంతంలో అనార్తుల ఆకలి తీర్చే ప్రయత్నం చేస్తుంది.
దేశంలో హాస్పిటల్స్ లో ఖాళీగా ఉన్న బెడ్స్ సమాచారాన్ని “ఫైండ్ ఏ బెడ్ పేరుతో తెలుసుకునేందుకు కాజ్ అంబాసిడర్గా నిధి ప్రచార సాయం చేస్తున్నారు.నిధి ఇప్పుడు కొవిడ్ వల్ల పలు రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకై డిస్ట్రిబ్యూట్ లవ్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించి సాయం అందించనున్నారు.
నిధి అగర్వాల్ మాట్లాడుతూ ‘ఇదొక స్వచ్ఛంద సంస్థ అనీ, ఈ సంస్థ వెబ్సైట్ ద్వారా ఎవరైనా తమ ఇబ్బందులను తమ దృష్టికి తీసుకొస్తే వారికి అవసరమైన మందులు, వైద్య సహాయం అందిస్తామనీ, దీనికోసం ఒక బృందాన్ని సిద్ధం చేశాననీ చెప్పారు.