పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రమిది నిధి అగర్వాల్ కథానాయిక మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ.దాయకర్ రావు నిర్మిస్తున్నారు.
రత్నం సమర్పకులు.ఈ చిత్రంలో పంచమి అనే పాత్రలో నిధి అగర్వాల్ నటిస్తుంది.
మంగళవారం ఆమె పుట్టిన రోజున సందర్భంగా చిత్రంలోని పాత్ర లుక్ విడుదల చేశారు చిత్ర బంధం.పదముల, ఇంద్రజాలికులు లాంటి దర్శకుడు క్రిష్.ఆయన తనదైన శైలిలో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు.17వ శతాబ్దం నాటి మొగలాయిలు, కుతుబ్ షాహీల శకం నేపథ్యంలో జరిగే కథతో ఈ చిత్రం ఒక దృశ్య కావ్యంగా రూపొందుతోంది.భారతీయ సినిమాల్లో ఇప్పటి వరకు చెప్పని కథ. కచ్చితంగా ప్రేక్షకులను అలరిస్తుంది ఏ విషయంలోనూ రాజీ పడకుండా 150 కోట్ల వ్యయంతో పాన్ ఇండియా చిత్రం గా నిర్మిస్తున్నామని తెలుగు తమిళ్ హిందీ మలయాళ భాషల్లో ఏకకాలంలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నామని చిత్ర బృందం తెలిపింది.ఈ చిత్రం ఇప్పటి వరకు 50 శాతం చిత్రీకరణ పూర్తయింది.త్వరలో కొత్త షెడ్యూల్ ప్రారంభిస్తామన్నారు చిత్ర నిర్మాత.ఈ చిత్రానికి సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి.ఛాయాగ్రహణం జ్ఞానశేఖర్ వి.ఎస్, మాటలు సాయిమాధవ్ బుర్రా.