సౌత్ లో హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకునే దిశగా దూసుకుపోతున్న అందాల భామ నిధి అగర్వాల్.కర్ణాటక నుంచి వచ్చిన ఈ అమ్మడు ముందుగా బాలీవుడ్ లోకి అడుగుపెట్టి అటు నుంచి తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది.
ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ఒక్కసారిగా ఈ అమ్మడు హాట్ అందాలకి అందరూ ఫిదా అయిపోయారు.అయితే నిధి అగర్వాల్ కి అవకాశాలు భాగానే వస్తున్న సక్సెస్ రేట్ అనుకున్న స్థాయిలో లేదు.
ఆమె నటిస్తున్న సినిమాలు అయితే ఎవరేజ్ లేదంటే ఫ్లాప్ టాక్ తెచ్చుకున్తున్నాయి.దీంతో అన్ లక్కీ గర్ల్ గా ఈ అమ్మడు ప్రస్తుతం ముద్ర పడిపోయింది.
అయినా కూడా సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు హాట్ ఫోటోషూట్ లతో నిధి అగర్వాల్ తనలోని ఉన్న నిధులని దర్శక, నిర్మాతలకి చూపిస్తూ ఉండటం అవకాశాలు పుష్కలంగానే వస్తున్నాయి.ప్రస్తుతం ఈ అమ్మడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి జోడీగా క్రిష్ మూవీలో నటించే అవకాశం కొట్టేసింది.
ఇదిలా ఉంటే నిధి అగర్వాల్ కు కొంత మంది అభిమానులు గుడి కట్టేశారు. గుడిలో ఆమె విగ్రహాన్ని ఏర్పాటు చేసి, పాలాభిషేకం కూడా చేశారు.దీనికి సంబందించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.వీటిని చూసి నిధి అగర్వాల్ ఆనందంతో ఒప్పొంగిపోయింది.తనపై ఇంత ప్రేమను చూపిస్తారని అసలు ఊహించలేదని ఆమె తెలిపింది.ఈ అభిమానాన్ని జన్మజన్మలకు గుర్తు పెట్టుకుంటానని చెప్పింది.
ఈ సందర్భంగా ఆమె సోషల్ మీడియా ద్వారా లేఖను షేర్ చేసింది.తన ఫ్యాన్స్ తనపై చూపించిన స్వచ్ఛమైన ప్రేమకు ధన్యవాదాలు తెలుపుతున్నానని నిధి చెప్పింది.
తన కోసం నిర్మించిన గుడిని చదువు, ఆహారం, నిర్వాసితులకు షెల్టర్ కోసం వినియోగించాలని కోరింది.మీ అందరి అభిమానం ముందు మరేదీ గొప్ప కాదని తెలిపింది.