పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ చిత్రం ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ మూవీగా నిలిచింది.ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్కు పవన్ తన సత్తా చాటాడు.
ఇక ఈ సినిమా అందించిన సక్సెస్తో పవన్ తన నెక్ట్స్ చిత్రాలను వరుసబెట్టి చేస్తూ దూసుకుపోతున్నాడు.దర్శకుడు క్రిష్ డైరెక్షన్లో ‘హరిహర వీరమల్లు’ అనే పీరియాడికల్ మూవీలో పవన్ నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే శరవేగంగా జరుపుకుంటోంది.ఈ సినిమాలో పవన్ సరికొత్త లుక్లో మనకు కనిపించనున్నాడు.
ఇక ఈ సినిమాలో పవన్ సరసన ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోంది.ఇప్పటికే ఆమె ఈ సినిమా షూటింగ్లో జాయిన్ కూడా అయ్యింది.అయితే ఈ సినిమాలో పవన్ సరసన నటించడంపై నిధి అగర్వాల్ కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది.తన కెరీర్లో పవన్ కళ్యాణ్ సినిమాలో నటించడం నిజంగా తనకు సంతోషాన్ని కలిగిస్తుందని నిధి చెప్పుకొచ్చింది.
పవన్ లాంటి క్రేజీ స్టార్ హీరో చిత్రంలో నటించడం తనకు దక్కిన అదృష్టమని ఆమె అంటోంది.ఇక ఈ సినిమా తన కెరీర్లోనే ప్రెస్టీజియస్ మూవీగా నిలవనుందని ఆమె చెప్పుకొచ్చింది.
కాగా ఈ సినిమాలో నిధి అగర్వాల్ తన పాత్ర చాలా వైవిధ్యంగా ఉండబోతుందని చెప్పుకొచ్చింది.ఇక క్రిష్ ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న విధానం తనకు బాగా నచ్చిందని ఆమె అంటోంది.
ఈ సినిమాలో నిధి అగర్వాల్తో పాటు మరో స్టార్ బ్యూటీ జాక్వెలిన్ ఫర్నాండెజ్ కూడా నటిస్తుండటంతో ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్ల పాత్రలు ఎలా ఉండబోతున్నాయా అనే ఆసక్తి అందరిలో నెలకొంది.ఈ సినిమాను తమిళ స్టార్ ప్రొడ్యూసర్ ఏఎం రత్నం అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నాడు.
ప్రస్తుతం లాక్డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడగా, త్వరలోనే తిరిగి ప్రారంభించేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.