సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరశురాం దర్శకత్వంలో సర్కారువారి పాట సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాలో కీర్తి సురేష్ మహేష్ కి జోడీగా నటిస్తుంది.
ఇప్పటికే సగానికి పైగా ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయినట్లు తెలుస్తుంది.ప్రస్తుతం కరోనా కారణంగా షూటింగ్ వాయిదా పడిందని సమాచారం.
ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత మహేష్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఒక సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు.హారికా హాసినీ క్రియేషన్స్ బ్యానర్ లోనే ఈ సినిమా ఉంటుంది.
తారక్ తో చేయాల్సిన కథనే కాస్తా మార్పులు చేసి మహేష్ ని త్రివిక్రమ్ ఒప్పించినట్లు టాక్ వినిపిస్తుంది.ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం క్యాస్టింగ్ సెలక్షన్ పనిలో త్రివిక్రమ్ ఉన్నారని సమాచారం.
ఇక దీనికోసం ముందుగా బాలీవుడ్ భామలని ప్రయత్నించారు.
ఇక ఫ్రేమ్ లోకి పూజా హెగ్డే, రష్మిక మందన పేర్లు కూడా వచ్చాయి.
ఇందులో త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా అంటే ఇద్దరు హీరోయిన్స్ పక్కాగా ఉంటారు.ఈ నేపధ్యంలో మెయిన్ హీరోయిన్ గా వీరిద్దరిలో ఒకరు కన్ఫర్మ్ అనే మాట వినిపిస్తుంది.
ఇక సెకండ్ లీడ్ రోల్ కోసం హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ ని సంప్రదించినట్లు తెలుస్తుంది.ఇక సూపర్ స్టార్ మహేష్ బాబుతో జోడీ కట్టే అవకాశం రావడంతో ఈ అమ్మడు కూడా ఏ మాత్రం ఆలోచించకుండా ఒకే చెప్పెసిందని బోగట్ట.
ఇప్పటికే నిధి అగర్వాల్ మహేష్ బాబు మేనల్లుడు గల్లా అశోక్ తో జోడీగా ఒక సినిమా చేస్తుంది.మరో వైపు పవన్ కళ్యాణ్ కి జోడీగా హరిహర వీరమల్లు సినిమాలో కూడా నిధి అగర్వాల్ నటిస్తుంది.
ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ తో నటించే ఛాన్స్ వస్తే ఇక ఈ అమ్మడు ఆనందానికి అవధులు ఉండవని ఫిలిం నగర్ లో చెప్పుకుంటున్నారు.