కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా చాలా వేగంగా విస్తరిస్తూ ప్రతి ఒక్కరిని భయపెడుతుంది.ఇండియాలో కూడా కరోనా బాధితుల సంఖ్య లక్షల్లోనే ఉంది.
అయితే ఇతరదేశాలతో పోల్చుకుంటే ఇండియాలో కరోనా మరణాల సంఖ్య తక్కువగా ఉండటం కొంత ఊరట కలిగించే విషయం.అయితే ఈ కరోనా మహమ్మారి బారిన సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు అందరూ పడుతున్నారు.
ఎంత జాగ్రత్తగా ఉన్నాకూడా ఏదో ఒక రూపంలో కరోనా వారిని తాకుతుంది.తాజాగా విశ్వసుందరి ఐశ్వర్యారాయ్ కూడా కరోనా లక్షణాలతో హాస్పిటల్ లో చేరింది.
ఇలాంటి వేళలో సినిమా షూటింగ్ లకి ప్రభుత్వాలు పర్మిషన్ ఇచ్చినా కూడా నిర్మాతలు, నటులు ధైర్యం చేయడం లేదు.షూటింగ్ లు పెడితే మరల ఎక్కడ ఈ కరోనా అందరికి అంటుకుంటుందో అనే టెన్షన్ పడుతున్నారు.
ఇదిలా ఉంటే హీరోయిన్స్ కూడా కరోనాకి భయపడి ఇంటిపట్టునే ఉంటున్నారు.ఇంట్లో కుటుంబంతో ఈ కరోనా కాలంలో కాలక్షేపం చేస్తున్నారు.
అయితే షూటింగ్ లు స్టార్ట్ అయినా కూడా హీరోయిన్స్ మాత్రం ఇప్పట్లో షూటింగ్ లకి వెళ్ళడానికి ఆసక్తి చూపించడం లేదు.కరోనా తగ్గే వరకు షూటింగ్ లలో పాల్గొనే ప్రసక్తే లేదని చాలా మంది భామలు తేల్చేశారు.
ఇప్పుడు ఈ వరుసలో అందాల భామ నిధి అగర్వాల్ కూడా వచ్చి చేరింది.కరోనాకి వాక్సిన్ వచ్చేంత వరకు షూటింగ్ లకి హాజరయ్యే ప్రసక్తే లేదని నిధి అగర్వాల్ తేల్చేసింది.
ఎంతకాలం అయినా పర్లేదు అవసరం అయితే ఇంట్లోనే ఉంటాను కానీ కరోనాతో బయటకి అడుగుపెట్టే ప్రయత్నం మాత్రం చేయను అని ఈ ముద్దుగుమ్మ కచ్చితంగా చెప్పేస్తుంది.