పవన్ కళ్యాణ్ త్వరలో వకీల్ సాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యాడు.ఇదే సమయంలో ఆయన క్రిష్ దర్శకత్వంలో ‘హరిహర వీరమల్లు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు కూడా రెడీ అయ్యాడు.
భారీ అంచనాల నడుమ రూపొందుతున్న హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.ఈ సినిమా లో హీరోయిన్ గా ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ నటిస్తున్న విషయం తెల్సిందే.
ఎంతో మంది స్టార్ హీరోయిన్స్ పేర్లు పరిశీలించి చివరకు ఈ అమ్మడిని ఎంపిక చేసిన చిత్ర యూనిట్ సభ్యులు ఇప్పటికే ఆమెపై చిత్రీకరణ మొదలు పెట్టినట్లుగా తెలుస్తోంది.ఇక ఈ సినిమా చిత్రీకరణ సందర్బంగా తాను అనుభవించిన అనుభూతులను నిధి అగర్వాల్ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.
నిధి అగర్వాల్ మాట్లాడుతూ.పవన్ కళ్యాణ్ గారు షూటింగ్ కు వస్తున్నారు అంటే అంతా కూడా సైలెంట్ గా ఉంటారు.ఆయన వచ్చిన తర్వాత పనులు అన్ని వదిలేసి అంతా ఆయన్ను చూసుకుంటూ ఉంటారు.ఆయన షూటింగ్ లో ఉన్న సమయంలో అందరి దృష్టి ఆయన పై ఉంటుంది.
ఆయన మాట్లాడిన కూర్చున్న డైలాగ్ చెప్పినా నటించిన ఇలా ప్రతి విషయంలో కూడా ఆయన్ను ఫాలో అవుతూ ఉంటారు.ఆయనతో కలిసి నటించడం అనేది నాకు అదృష్టంగా భావిస్తున్నాను.
జీవితంలో ఒక అద్బుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నాను అంటూ ఇస్మార్ట్ బ్యూటీ చెప్పుకొచ్చింది.ఇంకా ముద్దుగుమ్మ మాట్లాడుతూ హరిహర వీరమల్లు సినిమా లోని తన పాత్ర మేకప్ కోసం ఏకంగా 90 నిమిషాలు పడుతోంది.
ఇంతకు ముందు నేను చేసిన సినిమాలకు కేవలం 20 నిమిషాల్లో మేకప్ పూర్తి అయ్యేది.కాని యువరాణి పాత్ర అవ్వడం వల్ల ఆలస్యం అవుతుందని ఆమె చెప్పుకొచ్చింది.
ఈ సినిమా కోసం తాను కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నానంటూ చెప్పుకొచ్చింది.వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమా రాబోతుంది.